Junior NTR Remuneration : యంగ్ టైగర్ గా పేరుగాంచిన జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈ మధ్యే విడుదల కాగా.. అందులో ఆయన భీమ్గా అదరగొట్టేశారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అతి చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే 21 ఏళ్ల వయస్సులోనే సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాతో అనేక రికార్డులు బ్రేక్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
కాగా 2001 లో వచ్చిన నిన్ను చూడాలని సినిమాలో రవీనా రాజ్ పూత్ హీరోయిన్ కాగా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఈ మూవీని నిర్మించారు. అయితే ఈ మూవీ కంటే ముందుగానే తారక్ 1997లో బాల రామాయణం సినిమాలో నటించారు. ఈ మూవీని ఎమ్మెస్ రెడ్డి నిర్మించగా గుణశేఖర్ డైరెక్షన్ వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో ఆకట్టుకున్నారు. దీనికి గాను ఎన్టీఆర్ కు ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు కూడా లభించింది.
అయితే నిన్ను చూడాలని మూవీ ద్వారా హీరోగా కెరీర్ను స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ ఏడాదిలో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో నిన్ను చూడాలని మూవీ యావరేజ్ గా నిలవగా దీని తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా హిట్ అయింది. ఈ మూవీని రాజమౌళి డైరెక్షన్ లో గజాల హీరోయిన్ గా తెరకెక్కించారు. అయితే ఈ మూవీ తర్వాత ఇక ఎన్టీఆర్ వెనక్కి చూసుకోలేదు. స్టార్ నటుడు అయిపోయారు. ఈ క్రమంలోనే ఈ మూవీ అనంతరం సుబ్బు తీయగా.. దీంట్లో సోనాలి జ్యోతి హీరోయిన్ గా చేసింది. సురేష్ వర్మ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ నిరాశపరిచింది.
ఇక నిన్ను చూడాలని సినిమా షూటింగ్ మొదలైనప్పుడు ఎన్టీఆర్ వయస్సు17 సంవత్సరాలే. 2001 మే 25న ఈ మూవీ థియేటర్ లలోకి వచ్చింది. ఇది తన మొదటి సినిమా. ఈ క్రమంలోనే ఈ మూవీకి ఎన్టీఆర్కు రూ.4 లక్షల పారితోషికం ఇచ్చారు. దీంతో ఈ సినిమాకి ఇచ్చిన మొత్తాన్ని ఎన్టీఆర్ కు ఏం చేయాలో తెలియలేదు. దీంతో ఆయన ఆ మొత్తాన్ని నేరుగా తీసుకెళ్లి తమ అమ్మ చేతిలో పెట్టారు. ఇక రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ లో రెమ్యూనరేషన్ తోపాటు ఆయనకు క్రేజ్ కూడా పెరిగింది. అలా ఎన్టీఆర్ ఒక్కో స్టెప్ ఎదుగుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రస్తుతం రూ.50 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…