Naga Babu : బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెల్లవారుఝామున టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తుండగా, ఇందులో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే.
డ్రగ్స్ కేసులో మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు బయటకు రావడంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. నిహారిక విషయంలో అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దని.. నిహారిక వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని నాగబాబు స్పష్టం చేశారు. ఓ వీడియో విడుదల చేస్తూ ఇందులో పలు విషయాలు వెల్లడించారు. డ్రగ్స్ కేసుపై నేను స్పందించడానికి గల కారణం.. పబ్పై దాడులు జరిగిన సమయంలో నా కూతురు నిహారిక అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
నిహారికకు సంబంధించినంత వరకు ఆమె చాలా క్లియర్. ఇక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిహారిక విషయంలో ఎటువంటి తప్పు లేదు. సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దు అని నాగబాబు విజ్ఞప్తి చేశారు. మరి నాగబాబు విజ్ఞప్తి మేరకు అయిన ప్రచారాలు ఆగుతాయా అనేది చూడాలి. మరో వైపు దర్శకుడు సాయి రాజేష్ కూడా నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని తెలియజేశాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…