Chiranjeevi : సీనియర్ నటుడు మురళీ మోహన్ ఈమధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఇటీవలే ఓ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సమంత, నాగచైతన్య తమ ఇంటికి సమీపంలోనే ఉండేవారని.. వారు ఉన్న అపార్ట్మెంట్ను తనదేనని.. గతంలో దాన్ని చైతన్యకు విక్రయించానని తెలిపారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట ఎందుకు విడిపోయింది అనే విషయం అర్థం కాలేదని.. వారు విడిపోతున్న విషయం తనకు ముందుగానే తెలిసి ఉంటే.. వారికి ఎలాగో సర్దిచెప్పి వారిని కలిపి ఉంచేవాడినని అన్నారు.
ఇక మురళీ మోహన్ చిరంజీవిపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిపై అప్పట్లో విష ప్రయోగం జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. అప్పట్లో మరణమృదంగం సినిమాకు గాను షూటింగ్ను చెన్నైలో చేస్తున్నారు. అయితే చిరంజీవి రోజూ షూటింగ్లో యథావిధిగా ఒకసారి బయటకు వచ్చి ఫ్యాన్స్ను కలిసి మళ్లీ లోపలికి వెళ్తుంటారు. ఇది రోజువారీ దినచర్య. దీంతో ఆయనను చూసేందుకు షూటింగ్కు చాలా మంది వచ్చేవారు. అలా ఒక రోజు ఒక వ్యక్తి తన పుట్టిన రోజని చెప్పి చిరంజీవిచే కేక్ కట్ చేయించాడు. తరువాత ఆయన వద్దంటున్నా బలవంతంగా ఆయనకు కేక్ను తినిపించాడు. దీంతో ఆయన అయిష్టంగానే కేక్ తిని అక్కడి నుంచి వెంటనే లోపలికి వచ్చేశారు.
అయితే ఆయన పెదవులు నీలం రంగులోకి మారడాన్ని గుర్తించిన షూటింగ్ సిబ్బంది వెంటనే ఆ విషయాన్ని ఆయనకు చెప్పారు. దీంతో ఆయన హుటాహుటిన హాస్పిటల్కు వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజుల అనంతరం ఆయన డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ సంఘటన అప్పట్లో తెగ కలకలం రేపింది. చిరంజీవి అప్పట్లో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన సక్సెస్ను, పేరును చూసి ఓర్వలేకే ఆయనను అంతమొందించేందుకు ఎవరైనా విష ప్రయోగం చేసి ఉండవచ్చని మురళీ మోహన్ తెలిపారు. ఈ క్రమంలోనే మురళీ మోహన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…