Nagarjuna : నాగచైతన్య, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన మూవీ.. థాంక్ యూ. రూ.20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించారు. జూలై 22న రిలీజ్ అయిన ఈ మూవీకి తొలి రోజు రూ.2.50 కోట్ల మేర నెట్ కలెక్షన్లు వచ్చాయి. అయితే బ్రేక్ ఈవెన్కు ఇంకా రూ.22.50 కోట్లు రావాలని అంటున్నారు. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అనేక చోట్ల వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఓటీటీల ప్రభావమూ ఎక్కువగానే ఉంది. కనుక థియేటర్లకు ప్రేక్షకులు రావాలంటేనే వెనుకడుగు వేస్తున్నారు. నాలుగు రోజులు పోతే ఓటీటీల్లో చూడవచ్చని అనుకుంటున్నారు. అందువల్లే పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ థాంక్ యూ మూవీకి మాత్రం కలెక్షన్లు పెద్దగా రావడం లేదు. దీంతో మూవీ ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంటుందని అంటున్నారు.
అయితే థాంక్ యూ మూవీ ఏమోగానీ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే తెగ వైరల్ అవుతోంది. నాగచైతన్య, నాగార్జునలకు మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. అందువల్లే చైతూ వారికి దూరంగా ఉంటున్నాడట. ఇక థాంక్ యూ మూవీ ఫంక్షన్కు నాగార్జున వస్తారని దిల్ రాజు చెప్పారు. కానీ అది జరగలేదు. అలాగే థాంక్ యూ గురించి అక్కినేని ఫ్యామిలీ ఎక్కడా ప్రమోషన్ చేయడం లేదు. నాగార్జున కనీసం సోషల్ మీడియాలో అయినా పోస్టులు పెట్టలేదు. దీంతో అసలు ఏం జరిగి ఉంటుంది ? అని చర్చించుకుంటున్నారు.
తండ్రీ కొడుకులకు మధ్య విభేదాలు వచ్చాయని.. కనుకనే నాగార్జున.. నాగచైతన్యకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. థాంక్ యూ మూవీని నాగార్జున ప్రమోట్ చేయకపోవడంతో.. ఆ వార్తకు బలం చేకూరినట్లు అయింది. ఇక నాగార్జున హోస్ట్గా త్వరలో బిగ్ బాస్ షో సీజన్ 6 ప్రారంభం కానుండగా.. ఆయన నటించిన ఘోస్ట్ మూవీ దసరాకు విడుదల కానుంది. అలాగే చైతన్య నటించిన లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీ ఆగస్టులో రిలీజ్ కానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…