Nagarjuna : నాగచైతన్య, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన మూవీ.. థాంక్ యూ. రూ.20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించారు. జూలై 22న రిలీజ్ అయిన ఈ మూవీకి తొలి రోజు రూ.2.50 కోట్ల మేర నెట్ కలెక్షన్లు వచ్చాయి. అయితే బ్రేక్ ఈవెన్కు ఇంకా రూ.22.50 కోట్లు రావాలని అంటున్నారు. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అనేక చోట్ల వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఓటీటీల ప్రభావమూ ఎక్కువగానే ఉంది. కనుక థియేటర్లకు ప్రేక్షకులు రావాలంటేనే వెనుకడుగు వేస్తున్నారు. నాలుగు రోజులు పోతే ఓటీటీల్లో చూడవచ్చని అనుకుంటున్నారు. అందువల్లే పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ థాంక్ యూ మూవీకి మాత్రం కలెక్షన్లు పెద్దగా రావడం లేదు. దీంతో మూవీ ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంటుందని అంటున్నారు.
అయితే థాంక్ యూ మూవీ ఏమోగానీ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే తెగ వైరల్ అవుతోంది. నాగచైతన్య, నాగార్జునలకు మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. అందువల్లే చైతూ వారికి దూరంగా ఉంటున్నాడట. ఇక థాంక్ యూ మూవీ ఫంక్షన్కు నాగార్జున వస్తారని దిల్ రాజు చెప్పారు. కానీ అది జరగలేదు. అలాగే థాంక్ యూ గురించి అక్కినేని ఫ్యామిలీ ఎక్కడా ప్రమోషన్ చేయడం లేదు. నాగార్జున కనీసం సోషల్ మీడియాలో అయినా పోస్టులు పెట్టలేదు. దీంతో అసలు ఏం జరిగి ఉంటుంది ? అని చర్చించుకుంటున్నారు.
తండ్రీ కొడుకులకు మధ్య విభేదాలు వచ్చాయని.. కనుకనే నాగార్జున.. నాగచైతన్యకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. థాంక్ యూ మూవీని నాగార్జున ప్రమోట్ చేయకపోవడంతో.. ఆ వార్తకు బలం చేకూరినట్లు అయింది. ఇక నాగార్జున హోస్ట్గా త్వరలో బిగ్ బాస్ షో సీజన్ 6 ప్రారంభం కానుండగా.. ఆయన నటించిన ఘోస్ట్ మూవీ దసరాకు విడుదల కానుంది. అలాగే చైతన్య నటించిన లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీ ఆగస్టులో రిలీజ్ కానుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…