Mokshagna : నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అఫిషియల్ న్యూస్ ఏదీ నందమూరి ఫ్యామిలీ నుంచి రాలేదు. ఇప్పటికే అక్కినేని, మెగా, అల్లు, ఘట్టమనేని ఫ్యామిలీల నుంచి నట వారసులు వచ్చి స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. ఆ జనరేషన్ వారిలో బాలయ్య ఒక్కడే ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నారు. బాలయ్య తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేకమై స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడో, ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అనేది సస్పెన్స్ గా మారింది.
చిన్న వయసే కదా, హీరోగా రావడానికి ఇంకా టైముందిలే అని కొంతమంది అభిమానులు సర్ది చెప్పుకుంటున్నారు. సినిమాల్లో కనిపించకపోయినా కనీసం సోషల్ మీడియాలో కూడా కనిపించడు. కానీ అప్పుడప్పుడూ మెరుపులా మెరిసి వెళ్లిపోతుంటాడు. మొన్నా మధ్య తన బర్త్ డే సెలబ్రేషన్స్ లో తండ్రితో కలిసి జన్మదిన వేడుకలు చేసుకుని సందడి చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు థియేటర్ లో కనిపించాడు. మాదాపూర్ లోని సూపర్ స్టార్ మహేష్ బాబుకి చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్ థియేటర్ లో నందమూరి మోక్షజ్ఞ దర్శనమిచ్చాడు.
పక్కన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేకుండా ఒక్కడే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి ఏ సినిమా చూడ్డానికి వచ్చాడో తెలియదు గానీ మోక్షజ్ఞని చూసిన జనం ఒక్కసారిగా చుట్టుముట్టి సెల్ఫీలు తీసుకున్నారు. మోక్షజ్ఞ థియేటర్ లో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నందమూరి అభిమానులు.. యంగ్ లయన్ వస్తోంది చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో.. అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో.. చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…