Mokshagna : నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అఫిషియల్ న్యూస్ ఏదీ నందమూరి ఫ్యామిలీ నుంచి రాలేదు. ఇప్పటికే అక్కినేని, మెగా, అల్లు, ఘట్టమనేని ఫ్యామిలీల నుంచి నట వారసులు వచ్చి స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. ఆ జనరేషన్ వారిలో బాలయ్య ఒక్కడే ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నారు. బాలయ్య తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేకమై స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడో, ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అనేది సస్పెన్స్ గా మారింది.
చిన్న వయసే కదా, హీరోగా రావడానికి ఇంకా టైముందిలే అని కొంతమంది అభిమానులు సర్ది చెప్పుకుంటున్నారు. సినిమాల్లో కనిపించకపోయినా కనీసం సోషల్ మీడియాలో కూడా కనిపించడు. కానీ అప్పుడప్పుడూ మెరుపులా మెరిసి వెళ్లిపోతుంటాడు. మొన్నా మధ్య తన బర్త్ డే సెలబ్రేషన్స్ లో తండ్రితో కలిసి జన్మదిన వేడుకలు చేసుకుని సందడి చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు థియేటర్ లో కనిపించాడు. మాదాపూర్ లోని సూపర్ స్టార్ మహేష్ బాబుకి చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్ థియేటర్ లో నందమూరి మోక్షజ్ఞ దర్శనమిచ్చాడు.
పక్కన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేకుండా ఒక్కడే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి ఏ సినిమా చూడ్డానికి వచ్చాడో తెలియదు గానీ మోక్షజ్ఞని చూసిన జనం ఒక్కసారిగా చుట్టుముట్టి సెల్ఫీలు తీసుకున్నారు. మోక్షజ్ఞ థియేటర్ లో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నందమూరి అభిమానులు.. యంగ్ లయన్ వస్తోంది చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో.. అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో.. చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…