Mohan Babu : ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ ఈ నెల 18వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను తాజాగా నిర్వహించారు. అలాగే మోహన్ బాబు తన సినిమా గురించి, ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
సన్ ఆఫ్ ఇండియా మూవీ గురించి మోహన్ బాబు మాట్లాడుతూ.. డైమండ్ రత్నబాబు కథ చెప్పగానే వెంటనే నచ్చి ఓకే చేశానని, ఇందులో కొంత రిస్క్ ఉందని, అయినప్పటికీ సాహసం చేశామని తెలిపారు. ఇక మంచు విష్ణు ఈ చిత్రానికి నిర్మాత అని అన్నారు. ఈ మూవీలో అమ్మాయిల మధ్య లిప్ లాక్ సీన్లు పెట్టాల్సి వచ్చిందని.. అయితే విష్ణు అందుకు ఒప్పుకోలేదని అన్నారు. మనది పరువు ప్రతిష్టలు ఉన్న కుటుంబం, పైగా తాను మా అధ్యక్షుడు. నిర్మాతగా ఉండి ఈ సినిమా తీశాడు. ఇలాంటి సినిమాలో ముద్దు సీన్లు పెడితే అనవసరంగా వివాదాలకు తావు ఇచ్చినట్లు అవుతుందని.. విష్ణు అన్నాడని.. మోహన్ బాబు తెలిపారు.
అయితే కథ డిమాండ్ చేసింది కనుక లిప్ లాక్ సీన్లు పెట్టవచ్చు, ఏమీ కాదని.. తాను విష్ణుకు నచ్చజెప్పానని అన్నారు. ఇక ఈ మూవీలో.. ఒక ఎమ్మెల్యే వల్ల జీవితం నాశనం అయిన వ్యక్తి జైలు నుంచి తప్పించుకుని బయటకు వచ్చి ఏం చేశాడన్నది.. చూపించామని.. మిగిలిన కథ కోసం సినిమా చూడాలని అన్నారు. దీన్ని ముందుగా ఓటీటీలకే ఇవ్వాలని అనుకున్నామని, కానీ థియేటర్లలో విడుదల చేస్తున్నామని, తరువాత ఓటీటీల్లోనూ వస్తుందని అన్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…