IPL : బెంగళూరులో గత రెండు రోజులుగా కొనసాగిన ఐపీఎల్ 2022 మెగావేలం ఎట్టకేలకు ముగిసింది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు అన్నీ పోటీలు పడి మరీ ప్లేయర్లను కొనుగోలు చేశాయి. వచ్చే సీజన్లో తమ సత్తా చాటేందుకు ప్లేయర్లను సిద్ధం చేసుకున్నాయి. ఇక ఈసారి చెన్నై టీమ్ అందరినీ షాక్కు గురి చేసింది. ఆ జట్టులోని కీలక ఆటగాడైన సురేష్ రైనాను టీమ్ మళ్లీ కొనుగోలు చేయలేదు. దీంతో చెన్నై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము చిన్న తలగా పిలుచుకునే సురేష్ రైనాను చెన్నై టీమ్ కొనుగోలు చేయకపోవడంతో వారు మండిపడుతున్నారు.
చెన్నై టీమ్ ఈసారి రవీంద్ర జడేజా, ధోనీ, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్లను రిటెయిన్ చేసుకుంది. దీంతో మిగిలిన ప్లేయర్లు అందరూ వేలంలో నిలిచారు. వారిలో సురేష్ రైనా కూడా ఉన్నాడు. అయితే దీపక్ చాహర్, బ్రేవో, అంబటి రాయుడు, ఎన్.జగదీశన్, కేఎం ఆసిఫ్, మిచెల్ శాంట్నర్ వంటి పాత ఆటగాళ్లను చెన్నై తిరిగి కొనుగోలు చేసి టీమ్లోకి తీసుకుంది. దీంతో మళ్లీ పాత ప్లేయర్లు అందరూ టీమ్లోకి వచ్చేశారు. అయితే సురేష్ రైనాను మాత్రం జట్టు యాజమాన్యం కొనుగోలు చేయలేదు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
వాస్తవానికి 2020 ఐపీఎల్ సీజన్లో దుబాయ్లో నిర్వహించినప్పుడు సురేష్ రైనా టోర్నీ ఆరంభంలోనే వెనుదిరిగాడు. తనకు కుటుంబ సమస్యలు ఉన్నాయని, అందుకనే తాను టోర్నీ నుంచి తప్పుకున్నానని రైనా అప్పట్లో వెల్లడించాడు. కానీ కారణం అది కాదని.. అతనికి హోటల్ గది నచ్చకే టోర్నీ నుంచి తప్పుకుని వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. వాటిని జట్టు యాజమాన్యం, రైనా ఖండించలేదు. అయితే అది ముగిసిన అధ్యాయం. గతేడాది మళ్లీ చెన్నై టీమ్లో ఆడిన రైనా రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే చెన్నై మళ్లీ ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది.
ఇక గతంలోనూ అనేక మ్యాచ్లలో చెన్నై తరఫున ఆడిన రైనా జట్టుకు అనేక సార్లు కీలక విజయాలను అందించాడు. అయితే రైనా చేసిన సేవలను మరిచిపోయిన చెన్నై యాజమాన్యం కావాలనే అతన్ని జట్టులోకి తీసుకోలేదని, ఇది తమను తీవ్రంగా కలచివేస్తుందని, రైనాను తీసుకోనందుకు నిరసనగా చెన్నై జట్టుకు ఇకపై సపోర్ట్ చేయబోమని.. ముంబైకి సపోర్ట్ అందిస్తామని.. ఫ్యాన్స్ బహిరంగంగానే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంలో చెన్నై ఏం చేస్తుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…