IPL : బెంగళూరులో గత రెండు రోజులుగా కొనసాగిన ఐపీఎల్ 2022 మెగావేలం ఎట్టకేలకు ముగిసింది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు అన్నీ పోటీలు పడి మరీ ప్లేయర్లను కొనుగోలు చేశాయి. వచ్చే సీజన్లో తమ సత్తా చాటేందుకు ప్లేయర్లను సిద్ధం చేసుకున్నాయి. ఇక ఈసారి చెన్నై టీమ్ అందరినీ షాక్కు గురి చేసింది. ఆ జట్టులోని కీలక ఆటగాడైన సురేష్ రైనాను టీమ్ మళ్లీ కొనుగోలు చేయలేదు. దీంతో చెన్నై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము చిన్న తలగా పిలుచుకునే సురేష్ రైనాను చెన్నై టీమ్ కొనుగోలు చేయకపోవడంతో వారు మండిపడుతున్నారు.
చెన్నై టీమ్ ఈసారి రవీంద్ర జడేజా, ధోనీ, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్లను రిటెయిన్ చేసుకుంది. దీంతో మిగిలిన ప్లేయర్లు అందరూ వేలంలో నిలిచారు. వారిలో సురేష్ రైనా కూడా ఉన్నాడు. అయితే దీపక్ చాహర్, బ్రేవో, అంబటి రాయుడు, ఎన్.జగదీశన్, కేఎం ఆసిఫ్, మిచెల్ శాంట్నర్ వంటి పాత ఆటగాళ్లను చెన్నై తిరిగి కొనుగోలు చేసి టీమ్లోకి తీసుకుంది. దీంతో మళ్లీ పాత ప్లేయర్లు అందరూ టీమ్లోకి వచ్చేశారు. అయితే సురేష్ రైనాను మాత్రం జట్టు యాజమాన్యం కొనుగోలు చేయలేదు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
వాస్తవానికి 2020 ఐపీఎల్ సీజన్లో దుబాయ్లో నిర్వహించినప్పుడు సురేష్ రైనా టోర్నీ ఆరంభంలోనే వెనుదిరిగాడు. తనకు కుటుంబ సమస్యలు ఉన్నాయని, అందుకనే తాను టోర్నీ నుంచి తప్పుకున్నానని రైనా అప్పట్లో వెల్లడించాడు. కానీ కారణం అది కాదని.. అతనికి హోటల్ గది నచ్చకే టోర్నీ నుంచి తప్పుకుని వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. వాటిని జట్టు యాజమాన్యం, రైనా ఖండించలేదు. అయితే అది ముగిసిన అధ్యాయం. గతేడాది మళ్లీ చెన్నై టీమ్లో ఆడిన రైనా రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే చెన్నై మళ్లీ ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది.
ఇక గతంలోనూ అనేక మ్యాచ్లలో చెన్నై తరఫున ఆడిన రైనా జట్టుకు అనేక సార్లు కీలక విజయాలను అందించాడు. అయితే రైనా చేసిన సేవలను మరిచిపోయిన చెన్నై యాజమాన్యం కావాలనే అతన్ని జట్టులోకి తీసుకోలేదని, ఇది తమను తీవ్రంగా కలచివేస్తుందని, రైనాను తీసుకోనందుకు నిరసనగా చెన్నై జట్టుకు ఇకపై సపోర్ట్ చేయబోమని.. ముంబైకి సపోర్ట్ అందిస్తామని.. ఫ్యాన్స్ బహిరంగంగానే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంలో చెన్నై ఏం చేస్తుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…