IPL : బెంగళూరులో గత రెండు రోజులుగా కొనసాగిన ఐపీఎల్ 2022 మెగావేలం ఎట్టకేలకు ముగిసింది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు అన్నీ పోటీలు పడి మరీ ప్లేయర్లను కొనుగోలు చేశాయి. వచ్చే సీజన్లో తమ సత్తా చాటేందుకు ప్లేయర్లను సిద్ధం చేసుకున్నాయి. ఇక ఈసారి చెన్నై టీమ్ అందరినీ షాక్కు గురి చేసింది. ఆ జట్టులోని కీలక ఆటగాడైన సురేష్ రైనాను టీమ్ మళ్లీ కొనుగోలు చేయలేదు. దీంతో చెన్నై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము చిన్న తలగా పిలుచుకునే సురేష్ రైనాను చెన్నై టీమ్ కొనుగోలు చేయకపోవడంతో వారు మండిపడుతున్నారు.
చెన్నై టీమ్ ఈసారి రవీంద్ర జడేజా, ధోనీ, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్లను రిటెయిన్ చేసుకుంది. దీంతో మిగిలిన ప్లేయర్లు అందరూ వేలంలో నిలిచారు. వారిలో సురేష్ రైనా కూడా ఉన్నాడు. అయితే దీపక్ చాహర్, బ్రేవో, అంబటి రాయుడు, ఎన్.జగదీశన్, కేఎం ఆసిఫ్, మిచెల్ శాంట్నర్ వంటి పాత ఆటగాళ్లను చెన్నై తిరిగి కొనుగోలు చేసి టీమ్లోకి తీసుకుంది. దీంతో మళ్లీ పాత ప్లేయర్లు అందరూ టీమ్లోకి వచ్చేశారు. అయితే సురేష్ రైనాను మాత్రం జట్టు యాజమాన్యం కొనుగోలు చేయలేదు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
వాస్తవానికి 2020 ఐపీఎల్ సీజన్లో దుబాయ్లో నిర్వహించినప్పుడు సురేష్ రైనా టోర్నీ ఆరంభంలోనే వెనుదిరిగాడు. తనకు కుటుంబ సమస్యలు ఉన్నాయని, అందుకనే తాను టోర్నీ నుంచి తప్పుకున్నానని రైనా అప్పట్లో వెల్లడించాడు. కానీ కారణం అది కాదని.. అతనికి హోటల్ గది నచ్చకే టోర్నీ నుంచి తప్పుకుని వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. వాటిని జట్టు యాజమాన్యం, రైనా ఖండించలేదు. అయితే అది ముగిసిన అధ్యాయం. గతేడాది మళ్లీ చెన్నై టీమ్లో ఆడిన రైనా రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే చెన్నై మళ్లీ ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది.
ఇక గతంలోనూ అనేక మ్యాచ్లలో చెన్నై తరఫున ఆడిన రైనా జట్టుకు అనేక సార్లు కీలక విజయాలను అందించాడు. అయితే రైనా చేసిన సేవలను మరిచిపోయిన చెన్నై యాజమాన్యం కావాలనే అతన్ని జట్టులోకి తీసుకోలేదని, ఇది తమను తీవ్రంగా కలచివేస్తుందని, రైనాను తీసుకోనందుకు నిరసనగా చెన్నై జట్టుకు ఇకపై సపోర్ట్ చేయబోమని.. ముంబైకి సపోర్ట్ అందిస్తామని.. ఫ్యాన్స్ బహిరంగంగానే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంలో చెన్నై ఏం చేస్తుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…