Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈనెల 10వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ నువ్వా నేనా అంటూ మాటలయుద్దం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు 60 మందితో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తనకు అనుకూలంగా వేయించుకుంటున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తూ ఎన్నికల అధికారికి తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు.
కాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై మంచు విష్ణు మరోసారి ఘాటుగా స్పందించారు. బ్యాలెట్ కాకున్నా ఈవీఎం పెట్టినా కూడా ప్రకాష్ రాజ్ ఇదేవిధంగా ఆరోపిస్తారని, విష్ణు వెల్లడించారు. ప్రకాష్ రాజ్ అనవసరంగా తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారని.. తన ఫ్యామిలీ గురించి విమర్శించే హక్కు ప్రకాష్ రాజ్ కి లేదని తెలిపారు. ఇక ప్రకాష్ గతంలో రియల్ స్టార్ శ్రీహరితో కలిసి నాన్న దగ్గరికి వచ్చి అన్నయ్యా.. అంటూ నాన్న కాళ్లు పట్టుకున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రస్తుతం శ్రీహరి మన మధ్యలో లేరు, ఆయనే కనుక ఉండుంటే మీకు సరైన గుణపాఠం చెప్పేవారని, మా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో ప్రకాష్ రాజ్ ఈ విధమైన ఆరోపణలు చేయడం మంచిది కాదని మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనప్పటికీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…