సాయంత్రం సమయంలో వేడివేడిగా బజ్జీలు తింటూ చాయ్ తాగడాన్ని చాలామంది ఇష్టపడతారు. అయితే ఆ బజ్జీలు తినడం వల్ల మన ప్రాణాలు పోతాయని ఎవరమూ ఊహించము. ఇలా బజ్జీలను తినాలని ఆశ కలిగిన ఓ తల్లి, కొడుకు బజ్జీలను చేసుకుని ఎంతో ఇష్టంగా తిన్నారు. అయితే ఆ క్షణమే వారి జీవితంలో ఆఖరి క్షణం అవుతుందని వారు భావించలేదు. ఇలా బజ్జీలు తిన్న ఆ తల్లీ కొడుకులు అస్వస్థతకు గురై మృతి చెందారు. ఈ ఘటన బెళగావి తాలూకా హుదలి గ్రామంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాలలోకి వెళ్తే.. హుదలి గ్రామంలో నివసించే పార్వతి, తన కుమారుడు సోమనింగప్ప కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. ఈ క్రమంలోనే ఈ తల్లీ కొడుకులు ఇద్దరూ సాయంత్రం ఇంట్లో బజ్జీలు చేసుకుని తిన్నారు. ఇలా బజ్జీలు తిన్న కొంత సమయానికి తల్లీ కొడుకులిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వారికి వాంతులు విరోచనాలు అవడంతో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలోనే తల్లి కొడుకుల ఇద్దరి మరణానికి కారణం ఏంటని పలువురు అనుమానాలను వ్యక్తం చేయగా బజ్జీలలో పురుగుల మందు కలిసి ఉంటుందని, ఆ విషపు బజ్జీలు తినడం వల్ల ఈ విధంగా మరణించారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా చేశారా, లేకపోతే ఆ తల్లి కొడుకులు కావాలనే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…