సాయంత్రం సమయంలో వేడివేడిగా బజ్జీలు తింటూ చాయ్ తాగడాన్ని చాలామంది ఇష్టపడతారు. అయితే ఆ బజ్జీలు తినడం వల్ల మన ప్రాణాలు పోతాయని ఎవరమూ ఊహించము. ఇలా బజ్జీలను తినాలని ఆశ కలిగిన ఓ తల్లి, కొడుకు బజ్జీలను చేసుకుని ఎంతో ఇష్టంగా తిన్నారు. అయితే ఆ క్షణమే వారి జీవితంలో ఆఖరి క్షణం అవుతుందని వారు భావించలేదు. ఇలా బజ్జీలు తిన్న ఆ తల్లీ కొడుకులు అస్వస్థతకు గురై మృతి చెందారు. ఈ ఘటన బెళగావి తాలూకా హుదలి గ్రామంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాలలోకి వెళ్తే.. హుదలి గ్రామంలో నివసించే పార్వతి, తన కుమారుడు సోమనింగప్ప కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. ఈ క్రమంలోనే ఈ తల్లీ కొడుకులు ఇద్దరూ సాయంత్రం ఇంట్లో బజ్జీలు చేసుకుని తిన్నారు. ఇలా బజ్జీలు తిన్న కొంత సమయానికి తల్లీ కొడుకులిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వారికి వాంతులు విరోచనాలు అవడంతో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలోనే తల్లి కొడుకుల ఇద్దరి మరణానికి కారణం ఏంటని పలువురు అనుమానాలను వ్యక్తం చేయగా బజ్జీలలో పురుగుల మందు కలిసి ఉంటుందని, ఆ విషపు బజ్జీలు తినడం వల్ల ఈ విధంగా మరణించారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా చేశారా, లేకపోతే ఆ తల్లి కొడుకులు కావాలనే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…