మీకెప్పుడైనా రోడ్ల మీద డబ్బులు కనిపించాయా.. వెంటనే వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కదూ.. ఇలాంటి ఇన్సిడెంట్ ని నార్త్ ఇండియాలో ప్రజలు ఎదుర్కున్నారు. అంత కష్టపడి డబ్బుల్ని కలెక్ట్ చేసుకుంటే అవి కాస్తా నకిలీ అని తేలింది. దాంతో డిజప్పాయింట్ అయిన నెటిజన్లు ఒక్కసారిగా బాలీవుడ్ ప్రముఖ హీరో షాహిద్ కపూర్ పై మండి పడ్డారు. అసలు వివరాల్లోకి వెళితే..
సన్నీ అనే వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో వస్తున్న బిగ్గెస్ట్ సిరీస్ సన్నీ. ఈ సిరీస్ లో విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ షూట్ లో ఓ యాక్సిడెంట్ సీన్ ఉంటుంది. ఆ టైమ్ లో రోడ్డుపై 2 వేల రూపాయల నోట్ల కట్టలు పడాలి. దీని కోసం నకిలీ నోట్లతో సీన్ ని షూట్ చేశారు.
కానీ షూట్ అయ్యాక ఆ ప్లేస్ నుండి తీసేయడం మర్చిపోయారు. దీంతో విషయం తెలియని ప్రజలు నిజంగా డబ్బులే అనుకుని ఏరుకున్నారు. తీరా అవి నకిలివి అని తెలిసి ఫీల్ అయ్యారు.
ఈ విషయంలో గాంధీ మహాత్ముడు ఉన్న ఫోటోలు ఉన్న నోట్లు రోడ్డుపై పడేయటం ఏంటని ఈ సిరీస్ టీమ్ పై మండిపడుతున్నారు. అంతేకాకుండా వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ చేశారు. అలాగే గాంధీ ఫోటోలకు అవమానం జరిగిందనే క్రమంలో చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ఫిల్మ్ టీమ్ మాత్రం తాము నకిలీ నోట్లను తీసివేశామని తెలిపారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…