Manchu Lakshmi : మంచు ఫ్యామిలీపై ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు ఎక్కువగా వస్తున్నాయన్న విషయం విదితమే. వారు సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెడుతున్నా సరే.. నెటిజన్లు మాత్రం వారిని దారుణంగా విమర్శిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు తమ చేతులకు పని కల్పించారు. ఆమె పెట్టిన పోస్టు వల్ల మరోమారు ఆమెపై తెగ ట్రోల్స్ వస్తున్నాయి. ఆమెను నెటిజన్లు దారుణంగా విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు ఆమె ఏం పోస్ట్ చేసిందంటే..
మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుంది. తనకు ఓ యూట్యూబ్ చానల్ ఉంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో అధిక సంఖ్యలో ఆమెకు ఫాలోవర్లు కూడా ఉన్నారు. దీంతో ఆయా సామాజిక మాధ్యమాల్లో ఆమె తరచూ పోస్టులు పెడుతుంటుంది. ఇక తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. దానికి కాప్షన్ కూడా ఇచ్చింది.
మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ చెప్పుల ర్యాక్ తో కూడిన ఫొటోను షేర్ చేసింది. ఆ ర్యాక్ ఎదుట ఆమె కూర్చుని ముందట ఓ ఐదు జతల షూస్ను పెట్టుకుంది. వాటిల్లో ఏవి ధరించాలో తెలియడం లేదని.. ఎప్పుడూ సరైన షో దొరకదని.. ఆమె కాప్షన్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఆమె పోస్టుపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె పోస్టుకు మద్దతు తెలుపుతుండగా.. కొందరు మాత్రం విమర్శిస్తున్నారు.
నీకు అన్ని జతల షూస్, చెప్పులు ఉంటే అవి లేని వారికి ఇవ్వొచ్చు కదా.. షో చేయడం ఎందుకు.. నువ్వు చెప్పుల షాపు ఏమైనా పెట్టావా.. చెప్పులను, షూస్ను స్మగ్లింగ్ చేస్తున్నావా.. అంటూ మంచు లక్ష్మిని విమర్శిస్తున్నారు. ఇక మంచు లక్ష్మి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె మళయాళం సూపర్ స్టార్ మోహన్లాల్ మూవీలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. అందుకు గాను ఆమె ఇటీవల పలు విద్యల్లోనూ శిక్షణ తీసుకుంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…