Krithi Shetty : ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ.. కృతి శెట్టి. ఈ అమ్మడు తొలి సినిమానే హిట్ కావడంతో ఇక వెనుకకు తిరిగి చూడలేదు. ఆఫర్లు వరుసగా వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఈమె బంగార్రాజు మూవీలో నటించి అలరించింది. నటనలోనూ తనకంటూ ఈమె ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈమె రామ్ పక్కన ది వారియర్ అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక కృతి శెట్టి సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్గా ఉంటోంది. అలాగే పలు కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది.
కాగా కృతి శెట్టి ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్ కార్యక్రమానికి హాజరైంది. అయితే ఆమెతో నిర్వాహకులు కాసేపు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఓ యాంకర్ ఇంకో యాంకర్పై చేయి చేసుకున్నాడు. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కృతి శెట్టి ఓ దశలో బిత్తర చూపులు చూసింది. అయితే వెంటనే ఆ ఇద్దరు యాంకర్లలో ఒక యాంకర్ ఇది అంతా ప్రాంక్ అని.. భయపడాల్సిన పనిలేదని సర్ది చెప్పాడు. అయినప్పటికీ కృతి శెట్టి భయపడింది. వెంటనే ఆమెకు జలజలా కన్నీటి ధార వచ్చేసింది. కాసేపు ఆమె కంటతడి పెట్టింది.
తనకు ఇలాంటివి అంటే అసలు నచ్చవని.. ఇంకోసారి ఇలా చేయొద్దని ఆమె కోరింది. దీంతో నిర్వాహకులు వచ్చి ఆమెకు సారీ చెప్పారు. కాగా కృతి శెట్టికి చెందిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆమె ఎందుకు ఏడ్చింది ? అంటూ ఆరాలు తీస్తున్నారు. ఇదంతా ప్రాంక్ వల్లే జరిగిందని తెలుసుకుని మండిపడుతున్నారు. ఈమధ్య కాలంలో ప్రాంక్ వీడియోలు చేసేవారి సంఖ్య ఎక్కువవుతున్నందున.. ఏది నిజమైన సంఘటనో.. ఏది ఫేక్ సంఘటనో తెలియక జనాలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక కృతి శెట్టి అలా ఏడ్వడంతో ఆమెను ఓదారుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను కామెంట్ల రూపంలో ఓదారుస్తున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…