Manchu Lakshmi : మోహన్ బాబు కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన మంచు లక్ష్మి నటిగా మంచి గుర్తింపును కూడా సొంతం చేసుకుంది. అయితే ఈమె ఎక్కువ రోజుల పాటు అమెరికాలో ఉండి చదువుకోవడం వల్ల ఈమెకు తెలుగు సరిగ్గా రాదు. దీంతో ఇంగ్లిష్ యాసలో కలిపి తెలుగు మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే ఆమె యాసకు ఆమెను చాలా మంది విమర్శిస్తూ ట్రోల్ చేస్తుంటారు. ఇక ఈమె మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. అయితే వాటిని మంచు లక్ష్మి పెద్దగా పట్టించుకోదు.
ఇక ఈమధ్యే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పలు ప్రభుత్వ స్కూళ్లను సందర్శించిన మంచు లక్ష్మి ఆ స్కూళ్లను దత్తత తీసుకుంటున్నట్లు తెలియజేసింది. మొత్తం 50 స్కూళ్లను దత్తత తీసుకున్నానని.. ఇకపై వాటి బాధ్యతలను తాను చూసుకుంటానని ఈమె గొప్ప మనసు చాటుకుంది. దీంతో ఈమెను ట్రోల్ చేసేవారు కూడా ఈమె గొప్ప మనసుకు, దాతృత్వానికి ఫిదా అయ్యారు. ఈమెను అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే తాజాగా మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్లో ఓ ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె పలు విషయాలను వెల్లడించింది.
మంచు లక్ష్మికి విద్యా నిర్వాణ అనే కుమార్తె ఉన్న విషయం విదితమే. అయితే కరోనా వల్ల ఇన్ని రోజుల పాటు తన కుమార్తె ఇంట్లోనే ఉందని.. దీంతో తనకు, ఆమెకు ఎంతో బాండింగ్ (అనుబంధం) ఏర్పడిందని చెప్పుకొచ్చింది. అయితే సోమవారం (జూలై 25) తన కుమార్తెను స్కూల్కు పంపించానని.. దీంతో తనకు దుఃఖం ఆగలేదని తెలిపింది. తన కుమార్తెతో ఇన్ని రోజుల పాటు ఎలా ఉంటానా.. అని అనుకున్నానని.. కానీ ఆమెను ఇప్పుడు స్కూల్కు పంపిస్తుండడం బాధగా ఉందని.. అయితే ఇది తప్పదని.. దీనికి కూడా అడ్జస్ట్ కావాలని ఆమె చెప్పింది.
కాగా మంచు లక్ష్మి సినిమాల విషయానికి వస్తే.. తన తండ్రితో తొలిసారిగా కలసి అగ్ని నక్షత్రం అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ పోస్టర్ను ఈ మధ్యనే లాంచ్ చేశారు. దీంతోపాటు మళయాళ స్టార్ మోహన్ లాల్ సినిమాలోనూ ఈమె ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇందుకు గాను ఈమె కలరి విద్యను కూడా నేర్చుకుంది. అప్పట్లో ఇందుకు సంబంధించిన ఫొటోలను ఈమె షేర్ చేయగా.. అవి వైరల్గా మారాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…