OTT : ఈ మధ్య కాలంలో థియేటర్లలోకన్నా ఓటీటీల్లోనే సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులు కూడా థియేటర్ల కంటే ఓటీటీల్లో మూవీలు చూడడమే బెటర్ అని భావిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అనేక సినిమాలకు కలెక్షన్లు మాత్రం రావడం లేదు. ఇక వారం మారేకొద్దీ కొత్త కొత్త సినిమాలు, సిరీస్లు.. ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఓటీటీల పట్ల సహజంగానే ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇస్రో సైంటిస్టు నంబి నారాయణన్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ అనే మూవీని ఈ వారంలోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో ఆర్.మాధవన్ నటించగా.. ఈ మూవీని ఈ నెల 26వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేయనున్నారు. అలాగే విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 19 (1)(a) అనే మూవీ కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. దీన్ని ఈ నెల 29వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్లో రిలీజ్ చేయనున్నారు.
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లి అనే మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ను రాబట్టింది. ఈ క్రమంలోనే ఈ మూవీని ఈ నెల 29వ తేదీన వూట్ అనే యాప్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన గుడ్ లక్ జెర్రీ అనే మూవీని ఈ నెల 29వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. దీన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో నేరుగా రిలీజ్ చేస్తున్నారు. ఇలా పలు మూవీలు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…