Onion Rings : ప్రస్తుత తరుణంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ల ప్రభావం ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక యాప్ల ద్వారా మనకు ఫుడ్ డెలివరీ చేసుకునే సదుపాయం ఏర్పడింది. దీంతో యాప్లు పోటాపోటీగా మనకు ఆఫర్లను అందజేస్తున్నాయి. ఇక రెస్టారెంట్లు సైతం భోజన ప్రియులకు అనేక ఆఫర్లను అందిస్తున్నాయి. హోటల్స్లో కన్నా యాప్ల ద్వారా ఫుడ్ను ఆర్డర్ చేస్తేనే మనకు ఆఫర్లు ఎక్కువగా లభిస్తున్నాయి. దీంతో చిన్న చిన్న వంటకాలను కూడా చాలా మంది ఇంట్లో చేసుకోకుండా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉంది.. కానీ మనం పెట్టిన ఆర్డర్ తాలూకు ఫుడ్ కాకుండా వేరేది వస్తే ఎలా ఉంటుంది ? అప్పుడు పడే బాధను మాటల్లో చెప్పలేం. అవును.. సరిగ్గా అతనికి కూడా అలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఆన్లైన్ లో ఓ ఫుడ్ డెలివరీ యాప్లో ఓ వ్యక్తి ఫ్రైడ్ ఆనియన్ రింగ్స్ ఆర్డర్ పెట్టాడు. ఉల్లిపాయలను చక్రాల్లా సన్నని రింగుల్లా కట్ చేసి వాటిని నూనెలో వేయించి పకోడీల మాదిరిగా తయారు చేస్తారు. వాటినే ఆనియన్ రింగ్స్ అని పిలుస్తారు. అయితే వీటిని ఆర్డర్ పెడితే వీటికి బదులుగా పచ్చి ఉల్లిపాయలు వచ్చాయి. పచ్చి ఉల్లిపాయలను నీట్గా సన్నని రింగుల్లా కట్ చేసి పంపించారు. దీంతో వాటిని చూసి అతను ముందుగా షాకయ్యాడు. అయితే ఆ ఫుడ్ డెలివరీ యాప్కు, ఆ రెస్టారెంట్ వాళ్లకు బుద్ధి చెప్పడం కోసం అతను ఆ ఉల్లిపాయలను ఫొటో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
కాగా ఆ ఫొటోను చూసిన నెటిజన్లు షాకై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఉల్లిపాయల రింగ్స్ ఆర్డర్ చేస్తే వచ్చాయి కదా.. ఇంకెందుకు బాధ అని కొందరు అతన్ని ఆట పట్టిస్తుండగా.. ఇంకొందరు మాత్రం.. ఆ ఫొటోను షేర్ చేసి వారికి తగిన బుద్ధి చెప్పావని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే వాటిని యాప్ నిర్వాహకులు మార్చి మళ్లీ ఆనియన్ రింగ్స్ను పంపించారా.. అసలు తరువాత ఏమైంది.. అన్న వివరాలు మాత్రం తెలియలేదు. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…