Onion Rings : ప్రస్తుత తరుణంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ల ప్రభావం ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక యాప్ల ద్వారా మనకు ఫుడ్ డెలివరీ చేసుకునే సదుపాయం ఏర్పడింది. దీంతో యాప్లు పోటాపోటీగా మనకు ఆఫర్లను అందజేస్తున్నాయి. ఇక రెస్టారెంట్లు సైతం భోజన ప్రియులకు అనేక ఆఫర్లను అందిస్తున్నాయి. హోటల్స్లో కన్నా యాప్ల ద్వారా ఫుడ్ను ఆర్డర్ చేస్తేనే మనకు ఆఫర్లు ఎక్కువగా లభిస్తున్నాయి. దీంతో చిన్న చిన్న వంటకాలను కూడా చాలా మంది ఇంట్లో చేసుకోకుండా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉంది.. కానీ మనం పెట్టిన ఆర్డర్ తాలూకు ఫుడ్ కాకుండా వేరేది వస్తే ఎలా ఉంటుంది ? అప్పుడు పడే బాధను మాటల్లో చెప్పలేం. అవును.. సరిగ్గా అతనికి కూడా అలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఆన్లైన్ లో ఓ ఫుడ్ డెలివరీ యాప్లో ఓ వ్యక్తి ఫ్రైడ్ ఆనియన్ రింగ్స్ ఆర్డర్ పెట్టాడు. ఉల్లిపాయలను చక్రాల్లా సన్నని రింగుల్లా కట్ చేసి వాటిని నూనెలో వేయించి పకోడీల మాదిరిగా తయారు చేస్తారు. వాటినే ఆనియన్ రింగ్స్ అని పిలుస్తారు. అయితే వీటిని ఆర్డర్ పెడితే వీటికి బదులుగా పచ్చి ఉల్లిపాయలు వచ్చాయి. పచ్చి ఉల్లిపాయలను నీట్గా సన్నని రింగుల్లా కట్ చేసి పంపించారు. దీంతో వాటిని చూసి అతను ముందుగా షాకయ్యాడు. అయితే ఆ ఫుడ్ డెలివరీ యాప్కు, ఆ రెస్టారెంట్ వాళ్లకు బుద్ధి చెప్పడం కోసం అతను ఆ ఉల్లిపాయలను ఫొటో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
కాగా ఆ ఫొటోను చూసిన నెటిజన్లు షాకై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఉల్లిపాయల రింగ్స్ ఆర్డర్ చేస్తే వచ్చాయి కదా.. ఇంకెందుకు బాధ అని కొందరు అతన్ని ఆట పట్టిస్తుండగా.. ఇంకొందరు మాత్రం.. ఆ ఫొటోను షేర్ చేసి వారికి తగిన బుద్ధి చెప్పావని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే వాటిని యాప్ నిర్వాహకులు మార్చి మళ్లీ ఆనియన్ రింగ్స్ను పంపించారా.. అసలు తరువాత ఏమైంది.. అన్న వివరాలు మాత్రం తెలియలేదు. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…