Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మహిళ గొంతు కోసి పరారయ్యాడు. స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. అయితే ఆ మహిళ చనిపోగా.. సదరు నిందితుడికి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. పోలీసులు ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలోని ద్వారక అనే ప్రాంతంలో విభ (30) అనే మహిళ తన భర్తతో కలసి నివసిస్తోంది. ఈ జంట కూరగాయల షాప్ను నిర్వహిస్తున్నారు. అయితే దీపక్ అనే వ్యక్తి ఇటీవల వారి షాప్కు పీకలదాకా మద్యం సేవించి వచ్చాడు. దీంతో అతనికి, ఆ జంటకు గొడవ అయింది. అయితే ఇది మనస్సులో పెట్టుకున్న దీపక్ విభను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
అందులో భాగంగానే అతను ఆదివారం రాత్రి ఆ మహిళ రోడ్డుపై మార్కెట్లో నడిచి వస్తుండగా.. నెమ్మదిగా వచ్చి ఆమె గొంతు కోశాడు. తనతోపాటు సంచిలో తెచ్చుకున్న ఓ పదునైన వస్తువుతో ఆమెపై దాడి చేశాడు. అయితే స్థానికులు ఇది గమనించి వెంటనే అతన్ని పట్టుకుని చితకబాదారు. పోలీసులు రావడంతో వారు నిందితున్ని అరెస్టు చేశారు.
విభను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కాగా నిందితుడిని స్థానికులు కొట్టడం వల్ల అతనికి గాయాలు అయ్యాయని, అందువల్ల అతనికి చికిత్స కొనసాగుతుందని, అతను డిశ్చార్చి కాగానే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…