Viral Video : రోడ్డుపై మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ప్రమాదాలు ఊహించని విధంగా జరుగుతూనే ఉంటాయి. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఓ వ్యక్తి.. రోడ్డు మీద తన బైక్ ని రివర్స్ చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో వెనక్కి చూసుకోకపోవడం వల్ల పెద్ద గుంతలో పడిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
ఈ మధ్యకాలంలో పడిన భారీ వర్షాలకు రోడ్లు దారుణంగా మారిపోయాయి. ఏ రోడ్డుపై ఎక్కడ గుంత ఉంటుందో మనం చెప్పలేం. మనమే.. ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం ముందుకు వెళ్తున్నా.. వెనక్కి తీస్తున్నా.. రోడ్డు ఎలా ఉంటుందో చూసుకోవాలి. లేకపోతే.. ఇలాగే అవుతుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఓ వీడియో.. వాహనదారులను విపరీతంగా భయపెడుతోంది.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను వై మెన్ లివ్ లెస్ అనే పేజీలో ట్వీట్ చేశారు. మోటారు సైకిల్ నడుపుతున్న వ్యక్తిని వీడియోలో చూడవచ్చు. ఓ దుకాణం ముందు నిలబడి తన వాహనాన్ని రివర్స్ చేస్తున్నాడు. అతని వెనుక ఉన్న గుంతను అతను చూసుకోలేదు. నేరుగా వెళ్లి అతను భారీ గుంతలో పడిపోయాడు. జర్నీ ఆఫ్ ది ఎర్త్ అని వ్యంగ్యంగా క్యాప్షన్తో ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేశారు.
ఈ వీడియోకి ఇప్పటి వరకు 1.30 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మరికొందరు ఆ వీడియో చూసి నవ్వుకుంటున్నారు. దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. అసలు అతను మరో విశ్వంలోకి వెళ్తున్నాడు, అందుకే వెనక్కు వెళ్తున్నాడు.. అంటే.. మరో ట్విట్టర్ యూజర్ దీనిపై కామెంట్ చేస్తూ.. నిగూఢ పరిస్థితుల్లో అదృశ్యమయ్యాడు.. అని కామెంట్ చేశాడు. ఇక ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…