Mallidi Vashist : మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసార ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. చాలాకాలం తర్వాత కళ్యాణ్ రామ్కి ఈ చిత్రం కమర్షియల్ హిట్ ను ఇచ్చింది. అయితే బింబిసార మూవీ ద్వారా కళ్యాణ్ రామ్ కు హీరోగా ఎంత గుర్తింపు వచ్చిందో, డైరెక్టర్ వశిష్టకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. బింబిసార హిట్ తర్వాత టాలీవుడ్ లో డైరెక్టర్ విశిష్ట రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. ఇండస్ట్రీలో దర్శకుడిగా అవకాశం రావాలంటే ఎన్నో ఏళ్ళు కష్టపడాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.
అయినా కూడా దర్శకుడిగా అవకాశం దక్కని వాళ్ళు కృష్ణానగర్ లో చాలామందే ఉన్నారు. ఇక దర్శకుడిగా అవకాశం వచ్చి భారీ హిట్ అందుకుంటే మాత్రం హీరోలు, నిర్మాతలు ఆ దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమైపోతారు. ఇప్పుడు మల్లిడి వశిష్టతో సినిమా తీసేందుకు చాలా మంది మేకర్స్ ట్రై చేస్తున్నారట. దర్శకధీరుడు రాజమౌళి రేంజ్లో బింబిసార చిత్రాన్ని రూపొందించి ఇండస్ట్రీలో సినిమా ప్రముఖులతోపాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు వశిష్ట. ఇప్పటికే వేరే నిర్మాతలు ఆయనకి అడ్వాన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు.
అయితే వశిష్ట దృష్టి మాత్రం బింబిసార సీక్వెల్ మీదే ఉందట. పార్ట్ 1 కోసం జీతం తరహాలోనే నెలకు రూ.2 లక్షలు అందుకున్నారట. ఇదే తన రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. బింబిసార భారీ కమర్షియల్ హిట్ కాబట్టి లాభాలలో కొంత వాటా ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బింబిసార సీక్వెల్ మూవీ కోసం కళ్యాణ్ రామ్ వశిష్టకి రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క హిట్తో వశిష్ట రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇదిలా ఉండగా బింబిసార సీక్వెల్ మూవీ అధికారిక ప్రకటన ఎప్పుడుస్తుందో తెలీదు గానీ బింబిసార పార్ట్ 2 ఇంతకు మించి ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…