గురువారం, జూన్ 11, 2026
జ్యోతిష్యం & వాస్తు

Money Plant : మ‌నీ ప్లాంట్‌ను ఇలా పెంచండి.. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు.. డ‌బ్బు దండిగా ల‌భిస్తుంది..!

Money Plant : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా జీవించాలని అనుకుంటారు. అందుకోసం తప్పులు చేయకుండా, వాస్తు ప్రకారం పాటిస్తూ వుంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, మన జీవితం అద్భుతంగా ఉంటుంది. చాలామంది, అప్పుల నుండి బయట పడాలని…

Money Plant : మ‌నీ ప్లాంట్‌ను ఇలా పెంచండి.. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు.. డ‌బ్బు దండిగా ల‌భిస్తుంది..!

Money Plant : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా జీవించాలని అనుకుంటారు. అందుకోసం తప్పులు చేయకుండా, వాస్తు ప్రకారం పాటిస్తూ వుంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, మన జీవితం అద్భుతంగా ఉంటుంది. చాలామంది, అప్పుల నుండి బయట పడాలని అనుకుంటారు. వాస్తు ప్రకారం, అప్పుల నుండి బయటపడడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇలా చేయడం వలన, ఆర్థిక బాధల నుండి బయటపడచ్చు. సంతోషంగా ఉండొచ్చు. మీరు కూడా అప్పుల బాధ నుండి బయటపడాలనుకుంటున్నారా…? అయితే, తప్పక ఇలా చేయండి.

వాస్తు ప్రకారం అప్పులు బాధల నుండి బయటపడి, సంతోషంగా ఉండాలంటే, ఇంట్లో మనీ ప్లాంట్ ని పెంచాలి. పైగా మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే, ఇల్లు చూడడానికి బాగా కనపడుతుంది. ఎంతో ఆకర్షణంగా ఉంటుంది. నిర్వహణ కూడా ఈజీ గానే ఉంటుంది. వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది. సంపద పెరుగుతుంది. అయితే, మనీ ప్లాంట్ ని నాటేటప్పుడు సరైన దిశలో నాటడం మంచిది. ఈశాన్యం వైపు ఎప్పుడూ కూడా ఉంచొద్దు.

make these changes with Money Plant for luck and wealth
Money Plant

ఈ దిశలో మని ప్లాంట్ ఉంటే, ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు. పైగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మనీ ప్లాంట్ ని ఎప్పుడు కూడా, ఆగ్నేయం వైపు పెట్టాలి. గణేశుడికి ఈ దిశలో ఉంచితే ఇష్టమట. కాబట్టి, ఈ దిశలో మనీ ప్లాంట్ ని పెడితే మంచిది. మనీ ప్లాంట్ నేలని తాకకూడదు. మనీ ప్లాంట్ నాటిన తరవాత, త్వరగా ఎదిగిపోతుంది. ఫలితంగా మొక్క తీగలు బాగా పెరుగుతాయి. పందిరిలా అల్లేసుకుంటే సరిపోతుంది. వాస్తు ప్రకారం పెరుగుతున్న తీగలు శుభసూచకం. లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి, నేలని తాకనివ్వదు. ఇలా ఈ విధంగా మీరు, మనీ ప్లాంట్ ఇంట్లో పెంచితే ఆర్థిక బాధలు ఉండవు. సంతోషంగా ఉండొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.