Naresh : గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ల వ్యవహారం ఎంత సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. వీరు మైసూర్లోని ఒక హోటల్లో రమ్య రఘుపతికి పట్టుబడ్డారు. ఈ క్రమంలోనే వివాదం మరింత ముదిరింది. హోటల్ గది నుంచి బయటకు వస్తుండగా.. పవిత్రను రమ్య చెప్పుతో కొట్టబోయింది. కానీ అప్పుడు అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. ఆ సమయంలోనే నరేష్ తన భార్య రమ్యను చూస్తూ విజిల్స్ వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పవిత్రతో అలా పట్టుబడడమే కాకుండా.. తానేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు విజిల్స్ వేసుకుంటూ పోయాడని నరేష్ను నెటిజన్లు ట్రోల్ చేశారు.
ఇక ఈ వ్యవహారంపై సూపర్ స్టార్ కృష్ణ కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు తెలిసే తాము ఇదంతా చేస్తున్నామని అంతకు ముందు పవిత్ర లోకేష్ స్వయంగా మీడియా ముందు చెప్పేసింది. దీంతో కృష్ణ పేరు ఇందులో ఇన్వాల్వ్ అయింది. అయితే కృష్ణ నరేష్ వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్నారట. ఆయన నరేష్ను మందలించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నరేష్తో పర్సనల్గా మాట్లాడారట. ఈ క్రమంలోనే నరేష్కు మహేష్ ఒక రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మీకు ఏమైనా ఇలాంటి వ్యవహారాలు ఉంటే కూర్చుని పరిష్కారం చేసుకోండి.. కానీ ఇలా ఫ్యామిలీ విషయాలను బయటకు తీయవద్దు.. అంటూ మహేష్.. నరేష్ను కోరారట. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే నరేష్కు మహేష్ నిజంగానే రిక్వెస్ట్ చేశారా.. లేదా.. అన్నది తెలియదు కానీ.. నరేష్ వ్యవహారం మాత్రం రోజు రోజుకీ ముదిరి పాకానపడుతోంది. మరి దీనికి ముగింపు ఎప్పుడు ఇస్తారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…