Naresh : గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ల వ్యవహారం ఎంత సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. వీరు మైసూర్లోని ఒక హోటల్లో రమ్య రఘుపతికి పట్టుబడ్డారు. ఈ క్రమంలోనే వివాదం మరింత ముదిరింది. హోటల్ గది నుంచి బయటకు వస్తుండగా.. పవిత్రను రమ్య చెప్పుతో కొట్టబోయింది. కానీ అప్పుడు అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. ఆ సమయంలోనే నరేష్ తన భార్య రమ్యను చూస్తూ విజిల్స్ వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పవిత్రతో అలా పట్టుబడడమే కాకుండా.. తానేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు విజిల్స్ వేసుకుంటూ పోయాడని నరేష్ను నెటిజన్లు ట్రోల్ చేశారు.
ఇక ఈ వ్యవహారంపై సూపర్ స్టార్ కృష్ణ కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు తెలిసే తాము ఇదంతా చేస్తున్నామని అంతకు ముందు పవిత్ర లోకేష్ స్వయంగా మీడియా ముందు చెప్పేసింది. దీంతో కృష్ణ పేరు ఇందులో ఇన్వాల్వ్ అయింది. అయితే కృష్ణ నరేష్ వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్నారట. ఆయన నరేష్ను మందలించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నరేష్తో పర్సనల్గా మాట్లాడారట. ఈ క్రమంలోనే నరేష్కు మహేష్ ఒక రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మీకు ఏమైనా ఇలాంటి వ్యవహారాలు ఉంటే కూర్చుని పరిష్కారం చేసుకోండి.. కానీ ఇలా ఫ్యామిలీ విషయాలను బయటకు తీయవద్దు.. అంటూ మహేష్.. నరేష్ను కోరారట. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే నరేష్కు మహేష్ నిజంగానే రిక్వెస్ట్ చేశారా.. లేదా.. అన్నది తెలియదు కానీ.. నరేష్ వ్యవహారం మాత్రం రోజు రోజుకీ ముదిరి పాకానపడుతోంది. మరి దీనికి ముగింపు ఎప్పుడు ఇస్తారో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…