Meena : సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవలే తన భర్తను కోల్పోయిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆమెను ఒక్కసారిగా వివాదాలు చుట్టు ముట్టాయి. అలాగే భర్తతో కలసి ఉన్న మధుర క్షణాలను ఆమె గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తాజాగా మీనా తన భర్త గురించి మళ్లీ పోస్టు పెట్టింది. పెళ్లి రోజున ఆయనను తలచుకుంటూ ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భర్తను ఈ మధ్యే కోల్పోయిన మీనా తీవ్రమైన దుఃఖంలో ఉంది. ఆమె భర్త విద్యాసాగర్ కరోనా బారిన పడి కోలుకున్నారు. కానీ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. దీంతో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ క్రమంలోనే విద్యాసాగర్ జూన్ 29న చనిపోయారు. అప్పటి నుంచి మీనాపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. మీనా వల్లే ఆమె భర్త చనిపోయాడని.. కాదు వారి ఇంటి దగ్గర ఉన్న పావురాల వల్ల చనిపోయాడని.. ఇలా రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి.
అయితే ఆ వార్తలపై స్పందించిన మీనా ఈ సమయంలో తనను ఇలా తప్పుడు వార్తలతో ఇబ్బంది పెట్టొద్దని కోరారు. తనకు ప్రైవసీ కల్పించాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఆ తరువాత కూడా ఆమెపై రూమర్స్ ఆగలేదు. మీనా భర్తకు రూ.250 కోట్ల ఆస్తి ఉందని.. దాన్ని మీనాకు కాకుండా తన కుమార్తె నైనిక పేరిట రాశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే వీటిపై మీనా స్పందించలేదు. కానీ తాజాగా ఆమె తమ పెళ్లి రోజు సందర్భంగా మళ్లీ పోస్ట్ పెట్టింది. భర్తను తలచుకుంటూ ఎమోషనల్ అయింది.
నువ్వు ఒక అందమైన దేవుడిచ్చిన దీవెనవి. కానీ ఆ దేవుడు నిన్ను చాలా త్వరగా నా నుంచి తీసుకెళ్లాడు. నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటావు. మన ఫ్యామిలీ, నేను, ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమను, ప్రార్థనలను పంపిస్తున్నా.. మిలియన్ హార్ట్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. ఈ విపత్కర పరిస్థితుల్లో మాపై.. స్నేహితులు, ఫ్యామిలీ ఎవరు అయితే శ్రద్థ, ప్రేమను చూపిస్తూ.. సపోర్ట్ చేస్తున్నారో.. మీరు మా జీవితంలో ఉన్నందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాను. మీ ప్రేమను నేను గ్రేట్ ఫుల్గా ఫీల్ అవుతున్నాను.. అంటూ మీనా పోస్ట్ పెట్టింది. కాగా ఈమె పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మీనా తన భర్తను ఎంతగా మిస్ అవుతుందో కదా.. అని నెటిజన్లు సైతం విచారిస్తున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…