Meena : సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవలే తన భర్తను కోల్పోయిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆమెను ఒక్కసారిగా వివాదాలు చుట్టు ముట్టాయి. అలాగే భర్తతో కలసి ఉన్న మధుర క్షణాలను ఆమె గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తాజాగా మీనా తన భర్త గురించి మళ్లీ పోస్టు పెట్టింది. పెళ్లి రోజున ఆయనను తలచుకుంటూ ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భర్తను ఈ మధ్యే కోల్పోయిన మీనా తీవ్రమైన దుఃఖంలో ఉంది. ఆమె భర్త విద్యాసాగర్ కరోనా బారిన పడి కోలుకున్నారు. కానీ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. దీంతో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ క్రమంలోనే విద్యాసాగర్ జూన్ 29న చనిపోయారు. అప్పటి నుంచి మీనాపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. మీనా వల్లే ఆమె భర్త చనిపోయాడని.. కాదు వారి ఇంటి దగ్గర ఉన్న పావురాల వల్ల చనిపోయాడని.. ఇలా రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి.
అయితే ఆ వార్తలపై స్పందించిన మీనా ఈ సమయంలో తనను ఇలా తప్పుడు వార్తలతో ఇబ్బంది పెట్టొద్దని కోరారు. తనకు ప్రైవసీ కల్పించాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఆ తరువాత కూడా ఆమెపై రూమర్స్ ఆగలేదు. మీనా భర్తకు రూ.250 కోట్ల ఆస్తి ఉందని.. దాన్ని మీనాకు కాకుండా తన కుమార్తె నైనిక పేరిట రాశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే వీటిపై మీనా స్పందించలేదు. కానీ తాజాగా ఆమె తమ పెళ్లి రోజు సందర్భంగా మళ్లీ పోస్ట్ పెట్టింది. భర్తను తలచుకుంటూ ఎమోషనల్ అయింది.
నువ్వు ఒక అందమైన దేవుడిచ్చిన దీవెనవి. కానీ ఆ దేవుడు నిన్ను చాలా త్వరగా నా నుంచి తీసుకెళ్లాడు. నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటావు. మన ఫ్యామిలీ, నేను, ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమను, ప్రార్థనలను పంపిస్తున్నా.. మిలియన్ హార్ట్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. ఈ విపత్కర పరిస్థితుల్లో మాపై.. స్నేహితులు, ఫ్యామిలీ ఎవరు అయితే శ్రద్థ, ప్రేమను చూపిస్తూ.. సపోర్ట్ చేస్తున్నారో.. మీరు మా జీవితంలో ఉన్నందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాను. మీ ప్రేమను నేను గ్రేట్ ఫుల్గా ఫీల్ అవుతున్నాను.. అంటూ మీనా పోస్ట్ పెట్టింది. కాగా ఈమె పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మీనా తన భర్తను ఎంతగా మిస్ అవుతుందో కదా.. అని నెటిజన్లు సైతం విచారిస్తున్నారు.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…