Mahesh Babu : సూపర్స్టార్ కృష్ణ మరణాన్ని ఆయన కుటుంబంతో పాటు అభిమానులు కూడా ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. 350కు పైగా చిత్రాల్లో నటించి అలరించిన కృష్ణ ఆయన సినీ కెరిర్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ నెల నవంబర్ 15న కృష్ణ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నవంబర్ 27న హైదరాబాద్లో సూపర్స్టార్ కృష్ణ దశ దిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు దశ దిన కర్మకు తరలి వచ్చారు
సూపర్ సార్ కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ఈ ఆదివారం కృష్ణ పెద్ద కర్మను ఇంటి వద్ద శాస్త్రోక్తంగా పూజలు జరిపి మహేష్ బాబు నిర్వహించారు. ఆ తరవాత మధ్యాహ్నం వచ్చిన అతిథులకు విందు ఏర్పాటు చేశారు. పెద్ద కర్మకు విచ్చేసే అతిథుల కోసం రెండు వేదికలను మహేష్ బాబు ఏర్పాటు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెషన్లో, అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్లో విందు ఏర్పాటు చేశారు.
అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారని భావించిన మహేష్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పాస్ సిస్టమ్ పెట్టారు. అభిమానుల కోసం 5వేల పాసులను పంపిణీ చేశారు. పాస్లు ఉన్నవారిని మాత్రమే జేఆర్సీ కన్వెన్షన్లోకి అనుమతించారు. అభిమానుల కోసం 32 రకాల వంటకాలను మహేష్ బాబు సిద్ధం చేయించారు.
జేఆర్సీ కన్వెన్షన్లో భోజనం చేసిన కొందరు అభిమానులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. మహేష్ గారు మా కోసం 32 ఐటెమ్స్ పెట్టించారు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటి వద్ద పెద్ద కర్మకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తికాగానే మహేష్ బాబు.. అభిమానులను పలకరించేందుకు చిన్నాన్న ఆదిశేషగిరిరావుతో కలిసి జేఆర్సీ కన్వెన్షన్కు వెళ్లారు. అక్కడ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తన తండ్రి తనకు ఇచ్చిన గొప్ప ఆస్తి అభిమానులు అని.. ఈ విషయంలో తన తండ్రికి రుణపడి ఉంటానని మహేష్ బాబు అన్నారు. పెద్ద కర్మకు వచ్చినవారంతా భోజనం చేసి సురక్షితంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…