Mahesh Babu : సూపర్స్టార్ కృష్ణ మరణాన్ని ఆయన కుటుంబంతో పాటు అభిమానులు కూడా ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. 350కు పైగా చిత్రాల్లో నటించి అలరించిన కృష్ణ ఆయన సినీ కెరిర్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ నెల నవంబర్ 15న కృష్ణ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నవంబర్ 27న హైదరాబాద్లో సూపర్స్టార్ కృష్ణ దశ దిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు దశ దిన కర్మకు తరలి వచ్చారు
సూపర్ సార్ కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ఈ ఆదివారం కృష్ణ పెద్ద కర్మను ఇంటి వద్ద శాస్త్రోక్తంగా పూజలు జరిపి మహేష్ బాబు నిర్వహించారు. ఆ తరవాత మధ్యాహ్నం వచ్చిన అతిథులకు విందు ఏర్పాటు చేశారు. పెద్ద కర్మకు విచ్చేసే అతిథుల కోసం రెండు వేదికలను మహేష్ బాబు ఏర్పాటు చేశారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెషన్లో, అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్లో విందు ఏర్పాటు చేశారు.
అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారని భావించిన మహేష్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పాస్ సిస్టమ్ పెట్టారు. అభిమానుల కోసం 5వేల పాసులను పంపిణీ చేశారు. పాస్లు ఉన్నవారిని మాత్రమే జేఆర్సీ కన్వెన్షన్లోకి అనుమతించారు. అభిమానుల కోసం 32 రకాల వంటకాలను మహేష్ బాబు సిద్ధం చేయించారు.
జేఆర్సీ కన్వెన్షన్లో భోజనం చేసిన కొందరు అభిమానులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. మహేష్ గారు మా కోసం 32 ఐటెమ్స్ పెట్టించారు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటి వద్ద పెద్ద కర్మకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తికాగానే మహేష్ బాబు.. అభిమానులను పలకరించేందుకు చిన్నాన్న ఆదిశేషగిరిరావుతో కలిసి జేఆర్సీ కన్వెన్షన్కు వెళ్లారు. అక్కడ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తన తండ్రి తనకు ఇచ్చిన గొప్ప ఆస్తి అభిమానులు అని.. ఈ విషయంలో తన తండ్రికి రుణపడి ఉంటానని మహేష్ బాబు అన్నారు. పెద్ద కర్మకు వచ్చినవారంతా భోజనం చేసి సురక్షితంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…