Allu Sneha Reddy : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలే వేరు. గంగోత్రి చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై ఇతను హీరోనా అనే రేంజ్ నుంచి హీరో అంటే ఇలా ఉండాలి అనే రేంజ్ కి ఎదిగాడు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే యూత్ లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. సుకుమార్ దర్శకత్వంలో ఆర్య చిత్రంతో యువత మనసులను కొల్లగొట్టాడు అల్లు అర్జున్.
ఆ తరువాత బద్రీనాథ్, దేశముదురు, జులాయి వంటి చిత్రాలతో రేసుగుర్రంలా దూసుకుపోతూ అగ్రస్థాయి హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలాంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా స్టైలిష్ గానే ఉంటుంది. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప చిత్రంతో దేశ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు.
ఇక బన్నీ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే 2011 లో స్నేహరెడ్డిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆమె తండ్రి కె.పి.ఎస్ రెడ్డి తెలంగాణాలోనే పెద్ద విద్యావేత్త. రియల్ ఎస్టేట్ లో కూడా బాగా సంపాదించారు. కె.పి.ఎస్ రెడ్డి ఒకదశలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి ఆతర్వాత రియల్ ఎస్టేట్ ద్వారా భూములు విక్రయించి వేలకోట్లు సంపాదించాడు. దాంతో 25 ఏళ్ళ క్రితం సాధారణంగా ఉన్న స్నేహారెడ్డి కుటుంబం ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తింది.
దాంతో కె.పి.ఎస్ రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంజనీరింగ్ ,ఫార్మసీ కాలేజీలు నెలకొల్పి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యారు. ఈ కాలేజీ వ్యవహారాలను స్నేహ రెడ్డి చూసుకుంటుంది. ఇక బన్నీతో స్నేహరెడ్డి పెళ్ళికి దాదాపు 100కోట్లు కట్నం రూపంలో సమర్పించుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇక వీటికి తోడు సిటీలో విలువైన ఆస్తులను కుమార్తెకు పెళ్ళి కానుకగా రాసి ఇచ్చాడట ఆమె తండ్రి.
అప్పట్లో అల్లు అర్జున్ తన పెళ్లిని పదికోట్ల ఖర్చుతో గ్రాండ్ గా జరుపుకున్న సంగతి కూడా తెలిసిన విషయమే. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. షూటింగ్ లేనప్పుడు కుటుంబంతో కలసి సైట్ సీయింగ్ లు, ఫారిన్ ట్రిప్పులతో సరదాగా గడిపేస్తాడు బన్ని, స్నేహ. స్నేహ పెళ్లి తర్వాత ఓ రెస్టారెంట్, ఓ స్టూడియో పెట్టి వ్యాపారంలో కూడా దూసుకు పోతున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…