Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం నటించేందుకు సిద్ధం అవుతున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ పనులు మొదలు కాబోతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అతడు, ఖలేజా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది.
ప్రస్తుతం మహేష్ ఈ చిత్రం కోసం సరికొత్త లుక్ లో దర్శనమిస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో మహేష్ ని క్లాస్ లుక్ లో చూపించబోతున్నాడా.. లేక మాస్ లుక్ లో చూపించబోతున్నాడా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.
మహేష్ ముద్దుల తనయ చిన్నారి సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ డాన్స్ వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా మహేష్ బాబు తన ముద్దుల కుమార్తె సితారతో కలసి ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే డాన్స్ ఇండియా డాన్స్ షోకి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవల విడుదలయ్యింది. తండ్రితో కలసి సితార చేసే సందడిని చూసి ఫ్యాన్స్ తెగ ముచ్చట పడిపోతున్నారు. డాన్స్ అంటే ఒక సెలెబ్రేషన్స్ అని మహేష్ బాబు చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తాజాగా భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఫోటోలో మహేష్ బాబు స్విమ్మింగ్ పూల్ లో షర్ట్ లేకుండా కండలతో కనిపించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయే చిత్రం కోసం మహేష్ బాడీ బిల్డ్ చేస్తున్నట్లు కూడా ఒక ప్రచారం ఉంది. మహేష్ ఫ్యాన్స్ కోసం త్రివిక్రమ్ అల్టిమేట్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారనేది పక్కాగా చెప్పవచ్చు. తొలిసారి మహేష్ బాబు ఈ విధంగా మీసాలు, గడ్డం పెంచుతున్నట్లు అర్థం అవుతోంది. మహేష్ బాబు ఆన్ స్క్రీన్ పై ఎప్పుడూ పెద్ద మీసాలు, గడ్డం, షర్ట్ లేకుండా దర్శనం ఇవ్వలేదు. ఇక ఈ లుక్ మాత్రం మహేష్ బాబు అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. కాగా మహేష్ బాబు తన కూతురుతో కనిపించిన ఈ లుక్ మాత్రం వైరల్ గా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…