Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడికి ఆయన పునర్జన్మ ఇచ్చారు. శ్రీమంతుడు సినిమాలో ఆయన ఓ గ్రామాన్నే దత్తత తీసుకుని సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు. ఇక రియల్ లైఫ్లోనూ ఆయన ఇలాగే హీరో అనిపించుకుంటున్నారు. చిన్నారుల గుండె ఆపరేషన్లకు అయ్యే ఖర్చును ఆయన తన ఫౌండేషన్ ద్వారా భరిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన తన ఫౌండేషన్ ద్వారా తాజాగా ఓ బాలుడి శస్త్ర చికిత్సకు అయ్యే సహాయం చేశారు. దీంతో బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్లు తమ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లను చేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరికి రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కూడా సహకారం అందిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఓ 14 నెలల బాలుడికి గుండెకు శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. మరోవైపు బాలుడు ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీంతో వెంటనే స్పందించిన మహేష్ బాబు ఫౌండేషన్ ఆ బాలుడి శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో రెయిన్బో హాస్పిటల్ వైద్యులు ఆ బాలుడికి ఆపరేషన్ చేశారు. అది విజయవంతం అయింది. ఆ బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. క్షేమంగా చికిత్స పొందుతున్నాడు. ఇదంతా మహేష్ చలవే అని ఆయనను కొనియాడుతున్నారు.
ఇక మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా పేద చిన్నారికి ఇలా సహాయం అందించడంతో అందరూ ఆయనను అభినందిస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. తమ అభిమాన హీరో చేస్తున్న పనులకు వారు పొంగిపోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేష్ నటించిన సర్కారు వారి పాట ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఆయన తన నెక్ట్స్ సినిమాను త్రివిక్రమ్తో చేయనున్నారు. ఇందులో పూజా హెగ్డె హీరోయిన్ గా ఎంపికైంది. ఈ మూవీ తరువాత వచ్చే ఏడాది నుంచి రాజమౌళితో సినిమా ప్రారంభం అవుతుంది.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…