Prakash Raj : ఫిదా సినిమాతో హైబ్రిడ్ పిల్లగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ఈ మధ్య అనవసరంగా ఓ వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. కాశ్మీర్ లో కాశ్మీర్ పండిట్ల హత్యలకు, గోహత్యలకు పెద్దగా తేడా ఏమీ లేదని.. రెండూ ఒకటేనని సాయిపల్లవి కామెంట్స్ చేయడంతో ఓ వర్గం వారు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. బీజేపీ సహా.. హిందూ సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు ఆమె కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే సాయిపల్లవి క్షమాపణలు చెప్పాలని.. అనవసరమైన విషయాల్లో తెలిసీ తెలియకుండా కామెంట్స్ చేయడం సరికాదని హితలు పలికారు.
అయితే తనపై వస్తున్న ట్రోలింగ్, విమర్శలకు సాయి పల్లవి స్పందించింది. తన కామెంట్స్పై వివరణ ఇచ్చుకుంది. తన కామెంట్స్ ఎవరినైనా బాధించి ఉంటే అందుకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలియజేసింది. తన ఉద్దేశం.. హింస అనేది ఏ రూపంలో జరిగినా ఒక్కటేనని.. అందరం ముందుగా మనుషులమని.. తరువాతే మతాలు అని.. ఒక డాక్టర్గా తనకు ప్రాణం విలువ తెలుసని.. అయితే తాను ముందు వెనుక అన్న మాటలను కాకుండా ఒక సమయంలో అన్న మాటలను మాత్రమే చూపించారని.. దీని వల్ల తన కామెంట్స్ తప్పుడుగా జనంలోకి వెళ్లాయని.. అందుకు సారీ చెబుతున్నానని.. సాయి పల్లవి చెప్పింది. అయితే సాయి పల్లవి సారీ చెప్పి ఈ వివాదానికి అంతటితో చెక్ పెట్టింది. కానీ దీన్ని కొందరు వదిలేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ముగిసిపోయిందనుకున్న అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు.
సాయిపల్లవి ఆ కామెంట్స్ చేసినందుకు ఆమెకు మద్దతు తెలుపుతున్నానని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఆమె కామెంట్స్ సరైనవే అన్నారు. దీంతో ప్రకాష్ రాజ్ పై మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. భారీ ఎత్తున ఆయనను విమర్శిస్తున్నారు. వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో ప్రకాష్ రాజ్ మళ్లీ ఇలా ఎందుకు కామెంట్లు చేశారు.. ఆయన గొడవలు పెట్టించాలని చూస్తున్నారా.. అంటూ కొందరు ఆయనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్పై మళ్లీ ఆయా పార్టీలు, సంఘాలకు చెందిన నేతలు ఏమంటారో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…