Maa Elections : మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల వార్ ముగిసింది. గత కొద్ది రోజులుగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య ఫైటింగ్ హోరాహోరీగా సాగింది. నువ్వా నేనా అన్నట్టుగా ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకున్నారు. అయితే ఈ రోజు (ఆదివారం) ఉదయం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, కొద్ది సేపటి క్రితం ముగిసింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి పోలింగ్ సమయాన్ని గంట మేర పొడిగించారు. 2 గంటలకు ముగియాల్సిన ఓటింగ్ని 3 గంటల వరకు కొనసాగించారు.
రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుండగా, ఇంకొందరు లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పోలింగ్ కేంద్రం గేట్స్ మూసి వేయగా, లోపల ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. చివరి నిమిషంలో వచ్చిన అనసూయ ఓటు హక్కు వినియోగించుకుంది. మొత్తం 72 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. మొత్తం మా ఓటర్స్ 905 కాగా, 665 మంది ఓటు వేసినట్టు సమాచారం. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరగనుండగా, రాత్రి 11 గంటలకు రిజల్ట్ రానుంది.
మహేష్, ప్రభాస్, రానా, అల్లు అర్జున్, రకుల్, హన్సిక, త్రిష, నాగ చైతన్య, సమంత, కళ్యాణ్ రామ్తో పాటు పలువురు ప్రముఖులు ఓటింగ్కి దూరంగా ఉన్నారు. జెనీలియా స్పెషల్గా ఓటింగ్ కోసం హైదరాబాద్ రావడం విశేషం. పవన్ కళ్యాణ్ ‘మా’ ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…