Maa Elections : మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల వార్ ముగిసింది. గత కొద్ది రోజులుగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య ఫైటింగ్ హోరాహోరీగా సాగింది. నువ్వా నేనా అన్నట్టుగా ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకున్నారు. అయితే ఈ రోజు (ఆదివారం) ఉదయం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, కొద్ది సేపటి క్రితం ముగిసింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి పోలింగ్ సమయాన్ని గంట మేర పొడిగించారు. 2 గంటలకు ముగియాల్సిన ఓటింగ్ని 3 గంటల వరకు కొనసాగించారు.
రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుండగా, ఇంకొందరు లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పోలింగ్ కేంద్రం గేట్స్ మూసి వేయగా, లోపల ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. చివరి నిమిషంలో వచ్చిన అనసూయ ఓటు హక్కు వినియోగించుకుంది. మొత్తం 72 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. మొత్తం మా ఓటర్స్ 905 కాగా, 665 మంది ఓటు వేసినట్టు సమాచారం. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరగనుండగా, రాత్రి 11 గంటలకు రిజల్ట్ రానుంది.
మహేష్, ప్రభాస్, రానా, అల్లు అర్జున్, రకుల్, హన్సిక, త్రిష, నాగ చైతన్య, సమంత, కళ్యాణ్ రామ్తో పాటు పలువురు ప్రముఖులు ఓటింగ్కి దూరంగా ఉన్నారు. జెనీలియా స్పెషల్గా ఓటింగ్ కోసం హైదరాబాద్ రావడం విశేషం. పవన్ కళ్యాణ్ ‘మా’ ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…