Balakrishna : ఇన్నాళ్లూ వెండితెరపై సందడి చేసిన స్టార్స్ ఇప్పుడు బుల్లితెరపై హంగామా సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు బుల్లితెర ప్రేక్షకులని అలరించగా, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయ్యారు. ఓటీటీ వేదికగా బాలకృష్ణ ఓ టాక్ షో చేయబోతున్న విషయాన్ని ఆదివారం ఆహా ఓ పోస్టర్ విడుదల చేసి ప్రకటించింది. ‘ఆయన అడుగేస్తే.. షో మొదలేడితే.. టాక్ షోలన్నింటికీ బాప్ త్వరలో రానుంది..! పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది.
అన్స్టాపబుల్ అనే పేరుతో మొదలు కానున్న ఈ షో తొలి ఎపిసోడ్లో మోహన్ బాబు, ఆయన పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజు ఎన్టీఆర్ షోకి సమంత కూడా రానున్నట్టు కన్ఫాం అయింది. జెమిని టీవీలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’లో సమంత పాల్గొన్న విషయాన్ని ప్రోమో వీడియో ద్వారా కన్ఫాం చేశారు. ప్రోమోలో సమంత సీట్ చాలా హాట్గా ఉందని చెప్పడంతోనే ఈ షోపై అంచనాలు పెరిగాయి. దసరా నవరాత్రుల స్పెషల్గా ఈ ఎపిసోడ్ రాబోతోందని ప్రకటించారు.
ఇక ఈ రోజు బిగ్ బాస్ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. సాయంత్రం 6గం.ల నుండి బిగ్ బాస్ కార్యక్రమం మొదలు కానుండగా, ఈ కార్యక్రమానికి అఖిల్, పూజా హెగ్డే గెస్ట్లుగా హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర ప్రమోషన్ లోభాగంగా బిగ్ బాస్ స్టేజ్పై సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. నాగార్జున బంగర్రాజు గెటప్లో షోకి హాజరు కాగా, ఆయన పలువురు స్టార్స్తో కలిసి సందడి చేయనున్నారు. ఏదేమైనా వెండితెర స్టార్స్ బుల్లితెరపై రచ్చ చేస్తుండడం అభిమానులకి చాలా ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…