Balakrishna : ఇన్నాళ్లూ వెండితెరపై సందడి చేసిన స్టార్స్ ఇప్పుడు బుల్లితెరపై హంగామా సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు బుల్లితెర ప్రేక్షకులని అలరించగా, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయ్యారు. ఓటీటీ వేదికగా బాలకృష్ణ ఓ టాక్ షో చేయబోతున్న విషయాన్ని ఆదివారం ఆహా ఓ పోస్టర్ విడుదల చేసి ప్రకటించింది. ‘ఆయన అడుగేస్తే.. షో మొదలేడితే.. టాక్ షోలన్నింటికీ బాప్ త్వరలో రానుంది..! పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది.
అన్స్టాపబుల్ అనే పేరుతో మొదలు కానున్న ఈ షో తొలి ఎపిసోడ్లో మోహన్ బాబు, ఆయన పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజు ఎన్టీఆర్ షోకి సమంత కూడా రానున్నట్టు కన్ఫాం అయింది. జెమిని టీవీలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’లో సమంత పాల్గొన్న విషయాన్ని ప్రోమో వీడియో ద్వారా కన్ఫాం చేశారు. ప్రోమోలో సమంత సీట్ చాలా హాట్గా ఉందని చెప్పడంతోనే ఈ షోపై అంచనాలు పెరిగాయి. దసరా నవరాత్రుల స్పెషల్గా ఈ ఎపిసోడ్ రాబోతోందని ప్రకటించారు.
ఇక ఈ రోజు బిగ్ బాస్ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. సాయంత్రం 6గం.ల నుండి బిగ్ బాస్ కార్యక్రమం మొదలు కానుండగా, ఈ కార్యక్రమానికి అఖిల్, పూజా హెగ్డే గెస్ట్లుగా హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర ప్రమోషన్ లోభాగంగా బిగ్ బాస్ స్టేజ్పై సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. నాగార్జున బంగర్రాజు గెటప్లో షోకి హాజరు కాగా, ఆయన పలువురు స్టార్స్తో కలిసి సందడి చేయనున్నారు. ఏదేమైనా వెండితెర స్టార్స్ బుల్లితెరపై రచ్చ చేస్తుండడం అభిమానులకి చాలా ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…