రోజులు గడుస్తున్న కొద్దీ మూ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇక ప్రచారానికి కేవలం 1 రోజు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ 10న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. అయితే ఎన్నికలు ఏమో గానీ.. అటు మెగా ఫ్యామిలీ, ఇటు మోహన్ బాబు ఫ్యామిలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తమ మధ్య గొడవలు లేవంటూనే.. సినీ ఇండస్ట్రీల్లో వర్గాలు ఉన్నాయని వారు చెప్పకనే చెప్పినట్లు అవుతోంది.
గతంలో ఒకసారి చిరంజీవి, మోహన్బాబుల మధ్య గొడవలు ఉన్నాయని, ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఆ ఇద్దరూ కలసి ఒకే స్టేజిపై కనిపించి అలాంటిదేమీ లేదని, తాము స్నేహితులమేనని, ఎవరో అనే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే అంత వరకు బాగానే ఉన్నా.. వారు స్నేహితులు అయితే ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు ? అందరూ కలసి ఒకే వ్యక్తిని మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు కదా ? అన్నది అసలు ప్రశ్న.
సినీ ఇండస్ట్రీలో వివాదాలు కొత్తేమీ కావు. అప్పుడప్పుడూ అందులో ఉండే లుకలుకలు బయటకు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న వైరం మరోసారి బట్ట బయలైందని టాక్ నడుస్తోంది. ఈ రెండు ఫ్యామిలీలు నిజంగానే స్నేహితులు అయితే అందరూ కలసి కూర్చుని మాట్లాడుకుని ఒకరినే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు కదా.. అలా చేయడం లేదు.. అంటే వైరం ఉన్నట్లేగా.. అని చర్చించుకుంటున్నారు.
అయితే ఈ వైరం ఎన్నికల వరకు మాత్రమే పరిమితం అవుతుందా ? గెలుపు ఓటముల తరువాత ఇరు కుటుంబాలు సఖ్యతగా ఉంటాయా ? లేక ఇప్పుడు ఉన్నట్లుగానే వాతావరణం ఉంటుందా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…