Liger Movie Trailer : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ.. లైగర్. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ సరసన నటించింది. అలాగే అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను కొంత సేపటి క్రితమే విడుదల చేశారు. ఈ క్రమంలోనే ట్రైలర్ దుమ్ము లేపిందని ఫ్యాన్స్ అంటున్నారు. ట్రైలర్ను చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని అంటున్నారు.
లైగర్ మూవీని పూరీ జగన్నాథ్ స్వయంగా నిర్మించారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్పై పూరీ జగన్నాథ్, చార్మిలు ఈ మూవీని నిర్మించగా.. ఇందులో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా భాగమయ్యారు. హిందీ హక్కులను ఆయన కొన్నారు. ధర్మ ప్రొడక్షన్స్ కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామ్యం అయింది. ఇక రమ్యకృష్ణ ఇందులో విజయ్కి తల్లిగా నటించినట్లు ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది. ఇందులో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే డైలాగ్స్ అనేకం ఉన్నాయి. అలాగే విజయ్ మానరిజం కూడా అద్భుతంగా ఉంది. గత చిత్రాలతో పోలిస్తే విజయ్ ఈ మూవీలో పూర్తిగా భిన్నమైక లుక్లో కనిపించాడు. ఇందులో విజయ్ బాక్సింగ్ చాంపియన్గా నటిస్తున్నట్లు ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది.
ఇక లైగర్ మూవీ ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుండగా ఈ మధ్యే ఈ చిత్రంలోని విజయ్ లుక్కు చెందిన పోస్టర్ను లాంచ్ చేశారు. అందులో విజయ్ న్యూడ్గా కనిపించాడు. దీంతో ఆ ఫొటోపై అనేక ట్రోల్స్ వచ్చాయి. ఇక చిత్రంలో మైక్ టైసన్తో సెల్ఫీ దిగడమే సినిమా కథ అని ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…