Naga Chaitanya : సమంత, నాగచైతన్య గతేడాది అక్టోబర్ మొదటి వారంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎప్పుడైతే సమంత తన పేరు నుంచి అక్కినేని తొలగించి కేవలం ఎస్ అన్న అక్షరాన్ని ఉంచిందో.. అప్పటి నుంచే వీరు విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. తరువాత నెల రోజులకే అవే వార్తలు నిజమయ్యాయి. దీంతో వీరి విడాకులపై అనేక మంది స్పందించారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారో ఇప్పటి వరకు చెప్పలేదు. దీంతో ఈ ప్రశ్నకు సమాధానం లేకుండానే మిగిలిపోయింది.
అయితే ఈ మధ్యే సీనియర్ నటుడు మురళీ మోహన్.. సమంత, చైతన్య జంటపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అప్పట్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మూడు అపార్ట్మెంట్లను కట్టించానని, తన కుటుంబ సభ్యుల కోసం వాటిని కట్టిస్తే చైతన్య వాటిల్లో ఒకటి తనకు కావాలని అడిగాడని, అయితే తనకు ఎంతో ఇష్టమైన అపార్ట్మెంట్లని వాటిని ఇవ్వనని చెప్పానని.. కానీ కొద్ది రోజులకు నాగార్జున కాల్ చేసి అడగడంతో కాదనలేకపోయానని.. మురళీ మోహన్ తెలిపారు. అప్పటి నుంచి చైతన్య అదే అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండేవాడని అన్నారు. తరువాత సమంతతో కలసి నివసించడం మొదలు పెట్టాడని తెలిపారు.
అయితే వాస్తవానికి ఈ ఇద్దరూ విడిపోయిన తరువాత సమంత ఆ అపార్ట్మెంట్ను ఖాళీ చేసి వేరే చోటకు మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్లోనూ ఆఫర్లు వస్తుండడంతో ముంబైలో ప్రస్తుతానికి ఓ ఇంటిని రెంట్కు తీసుకుని సమంత ఉంటోంది. ఇక చైతూ విడాకుల అనంతరం కొంతకాలం పాటు హోటల్లో రూమ్ను తీసుకుని ప్రత్యేకంగా ఉన్నాడు. కానీ తరువాత ఇంకో ఇంటికి మారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తమ అపార్ట్మెంట్ ఖాళీగానే ఉందని తెలుస్తోంది. అయితే ఆ అపార్ట్మెంట్ ను చైతూ సమంతకే ఇచ్చేశాడట. కానీ అందులో ఆమె ఉండేందుకు ససేమిరా అందట. దీంతో దాన్ని చైతూ కూడా అలాగే వదిలేసి వేరే చోటకు వెళ్లిపోయాడు. ఇక ఆ అపార్ట్మెంట్ను తాను వాడుకోనని.. సమంతకే ఇచ్చేశానని చైతూ తెలిపాడట. దీంతో ఈ వార్త వైరల్ అవుతోంది.
అయితే భవిష్యత్తులో ఈ జంట మళ్లీ కలిసే అవకాశాలు లేకపోవడంతో చైతూ ఆ అపార్ట్మెంట్ను అమ్మకానికి పెట్టినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఆ తరువాత దాని గురించి అప్డేట్ లేదు. మరి వీరి భవిష్యత్తు రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…