Viral Video : రైలు పట్టాలపై దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే అనవసరంగా ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తుందని.. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొందరు అసలు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగానే ప్రవర్తిస్తున్నారు. దీంతో చాలా మంది రైలు ప్రమాదాలకు గురవుతూ మృత్యువాత పడుతున్నారు. రైలు వస్తున్నా పట్టించుకోకుండా పట్టాలు దాటుతూ ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అయితే అక్కడ కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. కానీ అదృష్టవశాత్తూ ఎవరి ప్రాణాలూ పోలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఆగి ఉన్న రైలు నుంచి కొందరు దిగి పట్టాలు దాటి అవతలి వైపుకు వెళ్తున్నారు. అయితే రైలు దిగి వేచి చూస్తున్న వృద్ధులను అవతలి వైపుకు దాటించేందుకు కొందరు మళ్లీ రైలు దగ్గరకు వచ్చారు. కానీ అంతలోపే ట్రెయిన్ రానే వచ్చింది. దీంతో పట్టాలు దాటుదామని అనుకున్నవారు కూడా వెనక్కి వచ్చేశారు. వారు రావడం కనీసం ఒక్క సెకన్ ఆలస్యం అయినా సరే వారి ప్రాణాలు పోయి ఉండేవి. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
రైలు పట్టాలపై చూసుకుని పట్టాలు దాటాలని.. లేదంటే రైలు ప్రమాదాల బారిన పడతారని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని.. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. కానీ జరిగి ఉంటే నిండు ప్రాణాలు పోయి ఉండేవని.. కనుక ఇప్పటికైనా పట్టాలపై జాగ్రత్తగా దాటాలని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…