Viral Video : రైలు పట్టాలపై దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే అనవసరంగా ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తుందని.. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొందరు అసలు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగానే ప్రవర్తిస్తున్నారు. దీంతో చాలా మంది రైలు ప్రమాదాలకు గురవుతూ మృత్యువాత పడుతున్నారు. రైలు వస్తున్నా పట్టించుకోకుండా పట్టాలు దాటుతూ ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అయితే అక్కడ కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. కానీ అదృష్టవశాత్తూ ఎవరి ప్రాణాలూ పోలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఆగి ఉన్న రైలు నుంచి కొందరు దిగి పట్టాలు దాటి అవతలి వైపుకు వెళ్తున్నారు. అయితే రైలు దిగి వేచి చూస్తున్న వృద్ధులను అవతలి వైపుకు దాటించేందుకు కొందరు మళ్లీ రైలు దగ్గరకు వచ్చారు. కానీ అంతలోపే ట్రెయిన్ రానే వచ్చింది. దీంతో పట్టాలు దాటుదామని అనుకున్నవారు కూడా వెనక్కి వచ్చేశారు. వారు రావడం కనీసం ఒక్క సెకన్ ఆలస్యం అయినా సరే వారి ప్రాణాలు పోయి ఉండేవి. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
రైలు పట్టాలపై చూసుకుని పట్టాలు దాటాలని.. లేదంటే రైలు ప్రమాదాల బారిన పడతారని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని.. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. కానీ జరిగి ఉంటే నిండు ప్రాణాలు పోయి ఉండేవని.. కనుక ఇప్పటికైనా పట్టాలపై జాగ్రత్తగా దాటాలని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…