Krishna : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా.. నెమ్మదిగా వేగం పుంజుకుంటోంది. అందులో భాగంగానే మహేష్ ఫ్యాన్స్ కూడా సినిమా హిట్ అయ్యే సరికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ చానల్ మాత్రం పనిగట్టుకుని మరీ సర్కారు వారి పాట మూవీపై తొలి రోజు నుంచే బురద జల్లడం ప్రారంభించింది. దీనికి రాజకీయ రంగు పులిమి నెగెటివ్ టాక్ మొదలు పెట్టింది. దీంతో ఆ చానల్పై మహేష్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారీగా ట్రోల్ చేశారు.
ఇక సర్కారు వారి పాట సినిమాపై నెగెటివ్ టాక్ను ప్రచారం చేయడంపై సూపర్ స్టార్ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ గత కొన్నేళ్లుగా సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు చేస్తున్నాడని.. ఇలాంటి అవకాశం అందరు హీరోలకు రాదని అన్నారు. సర్కారు వారి పాట కూడా మంచి మెసేజ్ మూవీ అని.. తాను ఈ మూవీ దూకుడు, పోకిరి కన్నా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పానని.. సరిగ్గా అలాగే జరిగిందని అన్నారు.
కాగా ఈ మూవీపై ఓ చానల్ నెగెటివ్ టాక్ను ప్రచారం చేయడంతో కృష్ణ స్పందించారు. కొందరు కావాలని పనిగట్టుకుని ఇలా చేస్తున్నారని అన్నారు. మహేష్ మొదటి నుంచి వివాద రహితుడని.. సౌమ్యంగా ఉంటాడని.. అతనిపై నిందలు వేయడం.. అతని సినిమాపై నెగెటివ్ టాక్ను ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. రాజకీయ కోణంలో సినిమాను చూడవద్దని అన్నారు. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ మూవీని ఆదరిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…