Krishna : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా.. నెమ్మదిగా వేగం పుంజుకుంటోంది. అందులో భాగంగానే మహేష్ ఫ్యాన్స్ కూడా సినిమా హిట్ అయ్యే సరికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ చానల్ మాత్రం పనిగట్టుకుని మరీ సర్కారు వారి పాట మూవీపై తొలి రోజు నుంచే బురద జల్లడం ప్రారంభించింది. దీనికి రాజకీయ రంగు పులిమి నెగెటివ్ టాక్ మొదలు పెట్టింది. దీంతో ఆ చానల్పై మహేష్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారీగా ట్రోల్ చేశారు.
ఇక సర్కారు వారి పాట సినిమాపై నెగెటివ్ టాక్ను ప్రచారం చేయడంపై సూపర్ స్టార్ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ గత కొన్నేళ్లుగా సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు చేస్తున్నాడని.. ఇలాంటి అవకాశం అందరు హీరోలకు రాదని అన్నారు. సర్కారు వారి పాట కూడా మంచి మెసేజ్ మూవీ అని.. తాను ఈ మూవీ దూకుడు, పోకిరి కన్నా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పానని.. సరిగ్గా అలాగే జరిగిందని అన్నారు.
కాగా ఈ మూవీపై ఓ చానల్ నెగెటివ్ టాక్ను ప్రచారం చేయడంతో కృష్ణ స్పందించారు. కొందరు కావాలని పనిగట్టుకుని ఇలా చేస్తున్నారని అన్నారు. మహేష్ మొదటి నుంచి వివాద రహితుడని.. సౌమ్యంగా ఉంటాడని.. అతనిపై నిందలు వేయడం.. అతని సినిమాపై నెగెటివ్ టాక్ను ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. రాజకీయ కోణంలో సినిమాను చూడవద్దని అన్నారు. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ మూవీని ఆదరిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…