Karate Kalyani : నటి కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల మధ్య జరిగిన గొడవ ఊహంచని మలుపు తిరిగి అది ఆమె మీదకే రివర్స్ అయిన విషయం విదితమే. ఆమె ఓ కుటుంబానికి చెందిన పసిపాపను దత్తత తీసుకోకుండానే పెంచుకుంటుందన్న విషయంలో ఆమెపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఆ చిన్నారి తల్లిదండ్రులతోపాటు కల్యాణి అధికారుల ఎదుట విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే అన్ని వివరాలను పరిశీలించిన అధికారులు కల్యాణికి ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చారు.
ఇక అధికారుల ఎదుట విచారణకు హాజరైన కల్యాణి పాపను దత్తత ఇంకా తీసుకోలేదని తెలియజేయగా.. వారు ఆ పాపను ఆ తల్లిదండ్రులకు అప్పగించేశారు. పాపను దత్తత తీసుకోవాలంటే చట్ట ప్రకారం అన్ని పత్రాలతో ఆ పని చేయాలని.. ఇలా పత్రాలు లేకుండా దత్తత తీసుకోవద్దని.. అధికారులు ఆమెకు సూచించారు. అయితే ఆ పాప తల్లిదండ్రులు కూడా కల్యాణి వెంటే ఉన్నారు. లేదంటే కేసులో ఆమె ఈ పాటికి జైలులో ఊచలు లెక్కబెడుతుండేది.
ఇక అధికారుల విచారణ అనంతరం పాపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను పాపను లీగల్గానే దత్తత తీసుకుంటానని స్పష్టం చేసింది. తనపై కొందరు కావాలనే బురదజల్లే యత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజకీయ కోణంలోనే తనపై కొందరు తప్పుడు కేసులు పెట్టించారని.. అయితే నిజా నిజాలు ఏమిటో నిగ్గు తేలుస్తానని.. తనను ఇబ్బందులకు గురి చేసిన వారిని విడిచి పెట్టబోనని కల్యాణి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆమె హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటోంది. అయితే ముందు ముందు ఈ విషయంలో ఇంకా ఏం జరుగుతుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…