Krishna Family : సూపర్స్టార్ మహేష్బాబు ఫ్యామిలీని గత కొంతకాలంగా దురదృష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నవంబర్ 15 తెల్లవారుజామున 4:09 గంటలకు సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఈ ఒక్క ఏడాదిలోనే మహేష్ బాబు కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటే అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం జనవరి 8న కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్బాబు అనారోగ్యంతో మృతి చెందారు. కృష్ణ ఉండగానే కాలేయ వ్యాధితో బాధపడుతోన్న రమేష్బాబు తీవ్ర అనారోగ్యంతో చిన్న వయస్సులోనే మృతి చెందడం కృష్ణను మానసికంగా కలిచి వేసింది.
తండ్రి తర్వాత తండ్రిలా అన్ని విధాల తనకు అండగా ఉంటున్న అన్న రమేష్ బాబు మరణం మహేష్ను కూడా ఎంతో బాధ పెట్టింది. ఆ బాధ నుంచి కోలుకోక ముందే మహేష్బాబు ఇంట్లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహేష్ తల్లి ఇందిరాదేవి ఈ ఏడాది సెప్టెంబర్ 28న మృతి చెందారు. 2019 విజయనిర్మల మృతితో కృష్ణ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ బాధ నుంచి బయటపడక ముందే ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణం, ఆ తర్వాత మొదటి భార్య ఇంద్రరా దేవి మరణం కూడా కృష్ణాను తీవ్రంగా కృంగదీసింది.
ఏదేమైనప్పటికీ ఓకే ఏడాదిలో 8 నెలల వ్యవధిలోనే ఏకంగా ముగ్గురు మృతిచెందడం మహేష్ బాబు కి, ఆయన కుటుంబ సభ్యులకు తీరని శోఖాన్ని మిగిల్చింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మృతిచెందడం ఘట్టమనేని కుటుంబానికి ఓ బ్యాడ్ సెంటిమెంట్గా మారింది. మహేష్ బాబు ఈ విషాదాల నుంచి త్వరగా కోలుకోవాలని మానసికంగా దృఢంగా నిలబడాలని సినీ ప్రముఖులతో పాటు ఘట్టమనేని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…