Krishna Family : సూపర్స్టార్ మహేష్బాబు ఫ్యామిలీని గత కొంతకాలంగా దురదృష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నవంబర్ 15 తెల్లవారుజామున 4:09 గంటలకు సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఈ ఒక్క ఏడాదిలోనే మహేష్ బాబు కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటే అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం జనవరి 8న కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్బాబు అనారోగ్యంతో మృతి చెందారు. కృష్ణ ఉండగానే కాలేయ వ్యాధితో బాధపడుతోన్న రమేష్బాబు తీవ్ర అనారోగ్యంతో చిన్న వయస్సులోనే మృతి చెందడం కృష్ణను మానసికంగా కలిచి వేసింది.
తండ్రి తర్వాత తండ్రిలా అన్ని విధాల తనకు అండగా ఉంటున్న అన్న రమేష్ బాబు మరణం మహేష్ను కూడా ఎంతో బాధ పెట్టింది. ఆ బాధ నుంచి కోలుకోక ముందే మహేష్బాబు ఇంట్లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహేష్ తల్లి ఇందిరాదేవి ఈ ఏడాది సెప్టెంబర్ 28న మృతి చెందారు. 2019 విజయనిర్మల మృతితో కృష్ణ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ బాధ నుంచి బయటపడక ముందే ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణం, ఆ తర్వాత మొదటి భార్య ఇంద్రరా దేవి మరణం కూడా కృష్ణాను తీవ్రంగా కృంగదీసింది.
ఏదేమైనప్పటికీ ఓకే ఏడాదిలో 8 నెలల వ్యవధిలోనే ఏకంగా ముగ్గురు మృతిచెందడం మహేష్ బాబు కి, ఆయన కుటుంబ సభ్యులకు తీరని శోఖాన్ని మిగిల్చింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మృతిచెందడం ఘట్టమనేని కుటుంబానికి ఓ బ్యాడ్ సెంటిమెంట్గా మారింది. మహేష్ బాబు ఈ విషాదాల నుంచి త్వరగా కోలుకోవాలని మానసికంగా దృఢంగా నిలబడాలని సినీ ప్రముఖులతో పాటు ఘట్టమనేని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…