Anasuya : అందాల యాంకర్ అనసూయ గురించి తెలుగువారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గ్లామర్ తో, మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ అందాల యాంకరమ్మ. పలు టీవీషోలలో యాంకర్ గా చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమా రంగంలో కూడా అడుగు పెట్టింది. మంచి మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ వెండితెర మీద కూడా రాణించింది. అనసూయకు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా బాగా కలిసొచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రంగమ్మత్తగా ప్రేక్షకులను మెప్పించింది.
రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్తగా మంచి నటనను కనబరచటంతో వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. పుష్ప చిత్రంలో కూడా దాక్షాయిని పాత్రలో ప్రేక్షకులను అనసూయ నటనతో మెప్పించింది. అనసూయ అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి పాత్రలను కంగారు పడకుండా ఎంచుకుంటుంది. ఇక అనసూయ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకుంది. 2010 ఫిబ్రవరి 10న అనసూయ కాస్తా అనసూయ భరద్వాజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇటీవల అనసూయ తన 38వ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవటానికి భర్త, కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ వెళ్ళింది. ఈ సందర్భంగా తన భర్త శశాంక్ భరద్వాజ్ ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది అనసూయ. ప్రేమ, అన్యోన్యంగా ఉండటం గురించి, చిన్న చిన్న లోపాలను అర్ధం చేసుకోవటం గురించి 17 సంవత్సరాల క్రితం నాకు ప్రామిస్ చేసావు. అప్పుడు నేను మాత్రమే ఉన్నాను. 8 సంవత్సరాల క్రితం ఇదే రోజు నా కోసం వీటి గురించి ప్రపంచానికి ప్రామిస్ చేసావు. హ్యాపీ 8 లవ్ అంటూ అనసూయ భర్త కోసం ట్వీట్ చేసింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…