Koratala Siva : ఆచార్య భారీ డిజాస్టార్ అవడం ఏమోగానీ.. రోజు రోజుకీ ఈ వివాదం ముదురుతుందని చెప్పవచ్చు. ఈ మూవీకి గాను రూ.84 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తామని గతంలోనే చరణ్ తోపాటు దర్శకుడు కొరటాల శివ కూడా చెప్పారు. అయితే కొరటాల శివ ఆ మొత్తంలో కొంత మేర ఇస్తానని అంగీకరించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఆయన తన ఆస్తులను అమ్ముకున్నారని.. ఆ మొత్తాన్ని ఇచ్చేశారని తెలుస్తోంది. అయితే మెగా ఫ్యామిలీ వైపు నుంచి డబ్బును వెనక్కి ఇచ్చేశారా.. లేదా.. అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. కానీ ఆచార్య వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని కొరటాల ఆఫీస్ దగ్గర డిస్ట్రిబ్యూటర్లు ధర్నా చేయడం కలకలం రేపింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్లు అయింది.
అయితే దర్శకుడు కొరటాల శివకు ఈ విషయంలో ఫ్యాన్స్ నుంచి మద్ధతు లభిస్తోంది. జస్టిస్ ఫర్ కొరటాల శివ పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ను వారు ట్రెండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వారు చిరంజీవి, చరణ్ లను తప్పుబడుతున్నారు. కొరటాలకు అసలు ఓటమి లేదని.. అలాంటిది ఆచార్య ఫ్లాప్ అయిందంటే అందుకు కారణం చిరు, చరణ్లు కథలో కలగజేసుకోవడమే అని అంటున్నారు. ఈ విషయంలో వారు కొరటాలకు క్షమాపణలు చెప్పి.. వెంటనే నష్ట పరిహారం మొత్తాన్ని చెల్లించాలని అంటున్నారు.
అయితే మరోవైపు మెగా ఫ్యాన్స్ మాత్రం కొరటాల ఫ్యాన్స్కు కౌంటర్ వేస్తున్నారు. అసలు సినిమా కథ, అవుట్ పుట్పై దృష్టి పెట్టకుండా కొరటాల ఈ మూవీకి చెందిన బిజినెస్ వ్యవహారాల్లో తలదూర్చారని.. అసలు ఆయనను ఇందులో డబ్బులు ఎవరు పెట్టమన్నారని.. కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ వార్ సోషల్ మీడియాలో మరింత ముదిరింది. అయితే ఈ వ్యవహారం చివరకు ఏమవుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…