Kamal Haasan : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమలహాసన్, ఫహాద్ ఫాసిల్, విజయ్ సేతుపతి, సూర్య ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ.. విక్రమ్. ఈ మూవీ జూన్ 3, 2022వ తేదీన రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద సునామీలా వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్లో స్ట్రీమ్ అవుతోంది. అయితే థియేటర్లతోపాటు ఓటీటీలోనూ ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఓటీటీలోనూ ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. విక్రమ్ సినిమా కమల హాసన్ సినిమా కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా నిలిచింది.
కాగా విక్రమ్ సినిమాకు రూ.120 కోట్ల మేర బడ్జెట్ అయినట్లు సమాచారం. ఈ మూవీకి ఇప్పటి వరకు మొత్తం రూ.442 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో షేర్ రూ.80 కోట్లు కాగా.. పన్నులు అవి పోతే.. మొత్తం రూ.176 కోట్ల వరకు నిర్మాతలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని నిర్మించింది స్వయంగా కమల్ హాసనే. ఆయన రెమ్యునరేషన్ ఏమీ తీసుకోలేదు. సొంతంగా నిర్మించారు. కనుక వచ్చే మొత్తం లాభాలు ఆయనకే వెళ్తాయి. కనుక ఈ మూవీ ఆయనకు లాభాల పంటను పండించిందని చెప్పవచ్చు. ఎంతలేదన్నా ఈ సినిమాతో ఆయన రూ.150 కోట్లు అయినా వెనకేసుకుని ఉంటారని సమాచారం. దీంతో తన అప్పులన్నీ తీరిపోతాయని ఇది వరకే ఆయన చెప్పారు. అలా ఒకే ఒక్క మూవీతో హిట్ కొట్టిన కమలహాసన్ తన అప్పులను తీర్చుకోవడమే కాదు.. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు.
ఇక విక్రమ్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సినిమా విజయం సాధించడంలో మ్యూజిక్దే ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. ఈ మూవీలో వచ్చే పీక్ సన్నివేశాల్లో అదరహో అనిపించేలా అనిరుధ్ సంగీతం అందించారు. అయితే దీనికి సీక్వెల్గా విక్రమ్ 2ను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…