Kamal Haasan : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమలహాసన్, ఫహాద్ ఫాసిల్, విజయ్ సేతుపతి, సూర్య ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ.. విక్రమ్. ఈ మూవీ జూన్ 3, 2022వ తేదీన రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద సునామీలా వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్లో స్ట్రీమ్ అవుతోంది. అయితే థియేటర్లతోపాటు ఓటీటీలోనూ ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఓటీటీలోనూ ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. విక్రమ్ సినిమా కమల హాసన్ సినిమా కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా నిలిచింది.
కాగా విక్రమ్ సినిమాకు రూ.120 కోట్ల మేర బడ్జెట్ అయినట్లు సమాచారం. ఈ మూవీకి ఇప్పటి వరకు మొత్తం రూ.442 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో షేర్ రూ.80 కోట్లు కాగా.. పన్నులు అవి పోతే.. మొత్తం రూ.176 కోట్ల వరకు నిర్మాతలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని నిర్మించింది స్వయంగా కమల్ హాసనే. ఆయన రెమ్యునరేషన్ ఏమీ తీసుకోలేదు. సొంతంగా నిర్మించారు. కనుక వచ్చే మొత్తం లాభాలు ఆయనకే వెళ్తాయి. కనుక ఈ మూవీ ఆయనకు లాభాల పంటను పండించిందని చెప్పవచ్చు. ఎంతలేదన్నా ఈ సినిమాతో ఆయన రూ.150 కోట్లు అయినా వెనకేసుకుని ఉంటారని సమాచారం. దీంతో తన అప్పులన్నీ తీరిపోతాయని ఇది వరకే ఆయన చెప్పారు. అలా ఒకే ఒక్క మూవీతో హిట్ కొట్టిన కమలహాసన్ తన అప్పులను తీర్చుకోవడమే కాదు.. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు.
ఇక విక్రమ్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సినిమా విజయం సాధించడంలో మ్యూజిక్దే ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. ఈ మూవీలో వచ్చే పీక్ సన్నివేశాల్లో అదరహో అనిపించేలా అనిరుధ్ సంగీతం అందించారు. అయితే దీనికి సీక్వెల్గా విక్రమ్ 2ను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…