Kiran Kumar : మనం టీవీల్లో అనేక సందర్భాల్లో చూసి ఉంటాం. బంగారం అనగానే ముందుగా ఆయన రూపమే మనకు ఠక్కున గుర్తుకు వస్తుంది. ఇతర బంగారు ఆభరణాలను విక్రయించే సంస్థలు హీరోయిన్లతో యాడ్స్ చేస్తుంటే.. ఆయన తన కంపెనీకి తానే యాడ్స్ చేస్తుంటారు. నాలుగు షాపులు తిరిగి ధరలు అడిగి తెలుసుకుని మరీ తమ వద్దకు రావాలని ఆయన చెబుతుంటారు. అవును.. ఈపాటికే ఆయన ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆయనే లలిత జ్యువెల్లర్స్ అధినేత ఎం.కిరణ్ కుమార్.
ఒకప్పుడు అందరిలాగే ఈయన కూడా మధ్య తరగతి కుటుంబంలోనే జీవించారు. కానీ బంగారం బిజినెస్లో ఈయన చేయి తిరిగింది. కోటీశ్వరుడు అయ్యారు. ఈ క్రమంలోనే తమ బంగారు షాపుల గురించి ఆయనే స్వయంగా ప్రచారం చేస్తుంటారు. దీంతో ఆయన యాడ్స్కు ఆదరణ బాగానే లభిస్తోంది. ఎప్పుడు బంగారం చెప్పినా ఆయన రూపమే మనకు గుర్తుకు వస్తుంది. అంతలా కిరణ్ కుమార్ సాధారణ ప్రజల జీవితాల్లోకి కూడా చొచ్చుకుపోయారు. అయితే ఆయన ఇటీవల రోడ్డు పక్కన ఓ బండి వద్ద టిఫిన్ చేస్తుండగా.. ఎవరో ఫొటో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటో వైరల్ అవుతోంది.
అన్ని కోట్లకు అధిపతి అయి ఉండి ఆయన అలా రోడ్డు పక్కన ఎందుకు టిఫిన్ చేస్తున్నారు. కావాలనుకుంటే ఆయన ఫైవ్ స్టార్ హోటల్కే వెళ్లవచ్చు కదా.. ఇంతకీ అసలు ఏం జరిగింది.. అని నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. అయితే ఆయన ఎక్సర్సైజ్ డ్రెస్లో ఉన్నారు. పక్కనే ఇంకో వ్యక్తి ఉన్నాడు. కనుక తన స్నేహితులతో వాకింగ్కు లేదా వ్యాయామానికి వెళ్లి ఉండవచ్చు. తరువాత దారిలో వస్తూ టిఫిన్ బండి దగ్గర ఆగి టిఫిన్ తిని ఉండవచ్చు.. అని తెలుస్తోంది. అంతేకానీ.. ఆయనకు ఏమీ కాలేదని.. కేవలం టిఫిన్ చేయడం కోసమే అక్కడ ఆగారని అర్థమవుతోంది.
ఎన్ని కోట్లు ఉన్నా రోడ్డు పక్కన బండి దగ్గర లభించే టిఫిన్లు భలే టేస్ట్ ఉంటాయి. కోటీశ్వరులు అయినా సరే మేడ నుంచి దిగి వచ్చి తినాల్సిందే. అలా ఆ టిఫిన్ల రుచి ఆయనకు నచ్చి ఉండవచ్చు. అందుకనే అక్కడ తిని ఉండవచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఈ ఫొటోపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అవి కూడా వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…