Kiran Kumar : రోడ్డు ప‌క్క‌న బండి వ‌ద్ద టిఫిన్ చేస్తున్న ల‌లిత జ్యువెల్ల‌ర్స్ అధినేత‌.. ఇంత‌కీ ఏమైంది..?

May 3, 2022 10:12 PM

Kiran Kumar : మ‌నం టీవీల్లో అనేక సంద‌ర్భాల్లో చూసి ఉంటాం. బంగారం అన‌గానే ముందుగా ఆయ‌న రూప‌మే మ‌న‌కు ఠ‌క్కున గుర్తుకు వ‌స్తుంది. ఇత‌ర బంగారు ఆభ‌ర‌ణాల‌ను విక్రయించే సంస్థ‌లు హీరోయిన్ల‌తో యాడ్స్ చేస్తుంటే.. ఆయ‌న త‌న కంపెనీకి తానే యాడ్స్ చేస్తుంటారు. నాలుగు షాపులు తిరిగి ధ‌ర‌లు అడిగి తెలుసుకుని మ‌రీ త‌మ వ‌ద్ద‌కు రావాల‌ని ఆయ‌న చెబుతుంటారు. అవును.. ఈపాటికే ఆయ‌న ఎవ‌రో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆయ‌నే ల‌లిత జ్యువెల్ల‌ర్స్ అధినేత ఎం.కిర‌ణ్ కుమార్‌.

kiran kumar lalitha jewelry owner taking breakfast in street
Kiran Kumar

ఒక‌ప్పుడు అంద‌రిలాగే ఈయ‌న కూడా మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలోనే జీవించారు. కానీ బంగారం బిజినెస్‌లో ఈయ‌న చేయి తిరిగింది. కోటీశ్వ‌రుడు అయ్యారు. ఈ క్ర‌మంలోనే త‌మ బంగారు షాపుల గురించి ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌చారం చేస్తుంటారు. దీంతో ఆయన యాడ్స్‌కు ఆద‌ర‌ణ బాగానే ల‌భిస్తోంది. ఎప్పుడు బంగారం చెప్పినా ఆయ‌న రూప‌మే మ‌న‌కు గుర్తుకు వ‌స్తుంది. అంత‌లా కిర‌ణ్ కుమార్ సాధార‌ణ ప్ర‌జ‌ల జీవితాల్లోకి కూడా చొచ్చుకుపోయారు. అయితే ఆయ‌న ఇటీవ‌ల రోడ్డు ప‌క్క‌న ఓ బండి వద్ద టిఫిన్ చేస్తుండ‌గా.. ఎవ‌రో ఫొటో తీసి దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటో వైర‌ల్ అవుతోంది.

అన్ని కోట్ల‌కు అధిప‌తి అయి ఉండి ఆయ‌న అలా రోడ్డు ప‌క్క‌న ఎందుకు టిఫిన్ చేస్తున్నారు. కావాల‌నుకుంటే ఆయ‌న ఫైవ్ స్టార్ హోట‌ల్‌కే వెళ్ల‌వ‌చ్చు క‌దా.. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగింది.. అని నెటిజ‌న్లు ఆరాలు తీస్తున్నారు. అయితే ఆయ‌న ఎక్స‌ర్‌సైజ్ డ్రెస్‌లో ఉన్నారు. ప‌క్క‌నే ఇంకో వ్య‌క్తి ఉన్నాడు. క‌నుక త‌న స్నేహితుల‌తో వాకింగ్‌కు లేదా వ్యాయామానికి వెళ్లి ఉండ‌వ‌చ్చు. త‌రువాత దారిలో వ‌స్తూ టిఫిన్ బండి ద‌గ్గ‌ర ఆగి టిఫిన్ తిని ఉండ‌వచ్చు.. అని తెలుస్తోంది. అంతేకానీ.. ఆయ‌న‌కు ఏమీ కాలేద‌ని.. కేవ‌లం టిఫిన్ చేయ‌డం కోస‌మే అక్క‌డ ఆగార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఎన్ని కోట్లు ఉన్నా రోడ్డు ప‌క్క‌న బండి ద‌గ్గ‌ర ల‌భించే టిఫిన్లు భ‌లే టేస్ట్ ఉంటాయి. కోటీశ్వ‌రులు అయినా స‌రే మేడ నుంచి దిగి వ‌చ్చి తినాల్సిందే. అలా ఆ టిఫిన్ల రుచి ఆయ‌న‌కు న‌చ్చి ఉండ‌వ‌చ్చు. అందుక‌నే అక్క‌డ తిని ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే నెటిజ‌న్లు ఈ ఫొటోపై ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతున్నారు. అవి కూడా వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now