Kalyaan Dhev : చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన విజేత సినిమాలో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తరువాత సూపర్ మచ్చి అనే సినిమా చేశాడు. కానీ ఇది కూడా ఆలస్యంగా విడుదలై ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక కల్యాణ్ తరువాత కిన్నెరసాని అనే మరో మూవీ చేశాడు. అయితే ఈ మూవీ ఎప్పుడో విడుదల కావల్సి ఉన్నా.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే త్వరలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. అయితే థియేటర్లలో మాత్రం కాదు.. ఓటీటీలో. జీ5 యాప్లో ఈ మూవీని నేరుగా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.
అయితే శ్రీజతో విడిగా ఉంటున్నాడన్న కారణమో.. లేక మెగాఫ్యామిలీకి దూరం అయ్యాడన్న కారణమో తెలియదు కానీ.. గతంలో కల్యాణ్ దేవ్ను తమ మనిషి అనుకున్న మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఆయనను దూరం పెట్టేశారు. శ్రీజ, కల్యాణ్ దేవ్ విడిపోయారని వార్తలు వస్తుండడం.. మరోవైపు మెగా ఫ్యామిలీ వేడుకల్లో ఎక్కడా కల్యాణ్ కనిపించకపోవడం.. ఆయన సినిమాలను మెగా ఫ్యామిలీ పట్టించుకోకపోవడంతో.. ప్రేక్షకులు కూడా కల్యాణ్ను లైట్ తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. లేదంటే శ్రీజతో కలసి ఉండి ఉంటే ఆయన సినిమాను తప్పక థియేటర్లలో రిలీజ్ చేసి ఉండేవారని అర్థం చేసుకోవచ్చు. అంటే.. వారు విడిపోయారని ఈ మూవీతో మరోమారు స్పష్టమవుతోంది. అయితే దీనిపై వారు ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఇవన్నీ పక్కన పెడితే కల్యాణ్ దేవ్ను మాత్రం ప్రస్తుతం పట్టించుకునే వారే కరువయ్యారు. ఆయనను లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక కిన్నెర సాని మూవీని జీ5 లో ఈ నెల 10న రిలీజ్ చేయనున్నారు. దీన్ని అశ్వత్థామ దర్శకుడు రమణ తేజ తెరకెక్కించగా.. పవన్ స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మించారు. ఇందులో మళయాళ భామ షీతల్ హీరోయిన్ గా నటించింది. రవీంద్ర విజయ్ ముఖ్య పాత్రలో నటించారు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…