Jio : భారత టెలికాం రంగంలో జియో నెట్వర్క్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే జియో మరో కొత్త సంచలనానికి తెరతీయనుంది. అత్యంత చవక ధరకే ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ను అందుబాటులోకి తేనుంది. జియో ఫోన్ నెక్ట్స్ పేరిట ఆ ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. అయితే ఇప్పుడీ ఫోన్ లాంచ్ తేదీని కన్ఫాం చేశారు.
జియో ఫోన్ నెక్ట్స్ను గత వినాయక చవితి రోజునే లాంచ్ చేయాల్సి ఉంది. కానీ చిప్ ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోన్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. అయితే గూగుల్ భాగస్వామ్యంతో ఈ ఫోన్ను జియో రూపొందించింది కనుక గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ ఫోన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోన్ను దీపావళి రోజున ఆవిష్కరిస్తామని కన్ఫాం చేశారు. కనుక దీపావళి రోజున యూజర్లు ఈ ఫోన్ కోసం రెడీగా ఉండాల్సిందే.
ఇక ఈ ఫోన్లో 5.5 ఇంచుల డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 215 ప్రాసెసర్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ప్రగతి ఓఎస్ (ఆండ్రాయిడ్ ఆధారితం).. వంటి అద్భుతమైన ఫీచర్లను అందివ్వనున్నారు. ఈ ఫోన్ ధర రూ.3499గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…