Jio : భారత టెలికాం రంగంలో జియో నెట్వర్క్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే జియో మరో కొత్త సంచలనానికి తెరతీయనుంది. అత్యంత చవక ధరకే ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ను అందుబాటులోకి తేనుంది. జియో ఫోన్ నెక్ట్స్ పేరిట ఆ ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. అయితే ఇప్పుడీ ఫోన్ లాంచ్ తేదీని కన్ఫాం చేశారు.
జియో ఫోన్ నెక్ట్స్ను గత వినాయక చవితి రోజునే లాంచ్ చేయాల్సి ఉంది. కానీ చిప్ ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోన్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. అయితే గూగుల్ భాగస్వామ్యంతో ఈ ఫోన్ను జియో రూపొందించింది కనుక గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ ఫోన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోన్ను దీపావళి రోజున ఆవిష్కరిస్తామని కన్ఫాం చేశారు. కనుక దీపావళి రోజున యూజర్లు ఈ ఫోన్ కోసం రెడీగా ఉండాల్సిందే.
ఇక ఈ ఫోన్లో 5.5 ఇంచుల డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 215 ప్రాసెసర్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ప్రగతి ఓఎస్ (ఆండ్రాయిడ్ ఆధారితం).. వంటి అద్భుతమైన ఫీచర్లను అందివ్వనున్నారు. ఈ ఫోన్ ధర రూ.3499గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…