T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 20వ మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఇంగ్లండ్ విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ సులభంగానే ఛేదించింది. ఈ క్రమంలో బంగ్లాపై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి కేవలం 124 పరుగులను మాత్రమే చేయగలిగింది. బంగ్లా బ్యాట్స్మెన్లలో ముష్ఫికుర్ రహీమ్ 30 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3 వికెట్లు పడగొట్టగా మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్ చెరో 2 వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 126 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో జేసన్ రాయ్ 38 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి రాణించగా.. డేవిడ్ మలన్ 25 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో షొరిఫుల్ ఇస్లామ్, నసుమ్ అహ్మద్లక చెరొక వికెట్ దక్కింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…