T20 World Cup 2021 : అబుధాబి వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 20వ మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఇంగ్లండ్ విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ సులభంగానే ఛేదించింది. ఈ క్రమంలో బంగ్లాపై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి కేవలం 124 పరుగులను మాత్రమే చేయగలిగింది. బంగ్లా బ్యాట్స్మెన్లలో ముష్ఫికుర్ రహీమ్ 30 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3 వికెట్లు పడగొట్టగా మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్ చెరో 2 వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 126 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో జేసన్ రాయ్ 38 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి రాణించగా.. డేవిడ్ మలన్ 25 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో షొరిఫుల్ ఇస్లామ్, నసుమ్ అహ్మద్లక చెరొక వికెట్ దక్కింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…