Jeevitha : గరుడ వేగ సినిమా కోసం రూ. 26 కోట్లు ఎగ్గొట్టారని, దీనికి సంబంధించిన కేసులో జీవితకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారని వచ్చిన నేపథ్యంలో జీవిత స్పందించింది. ఈ కేసు ఏడాది నుంచి నగరి కోర్టులో నడుస్తోంది. ఇంతకు ముందు కూడా నాపై వారెంట్ జారీ అయ్యింది. తాజాగా సమన్లు వచ్చిన మాట వాస్తవమే కానీ నేను అరెస్ట్ కాలేదు. ఈ కేసులో నేను గెలిచాను. వాళ్లు చేస్తున్న ఆరోపణలలో ఎంత మాత్రం వాస్తవం లేదు, అవన్నీ తప్పుడు ఆరోపణలు.. అని పేర్కొంది.
మేము ఎలాంటి తప్పు చేయలేదు. కోర్టు తీర్పు తర్వాత అన్ని వివరాలు చెబుతాం. మాపై ఆరోపణలు చేసిన వారు చాలా తప్పులు చేశారు, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి.. అని జీవిత ప్రెస్మీట్లో భాగంగా వెల్లడించింది. నేను దాక్కో లేదని, తిరుగుతూనే ఉన్నానని అన్నారు. కోటేశ్వర రాజు మీద అనేక ఆరోపణలు ఉన్నాయని, తామంటే నచ్చని వారెవరో వెనక ఉండి ఇలాంటి పనులు చేస్తుంటారని జీవిత చెప్పారు. ఓవర్ యాంబిషన్ కారణంగా కోటేశ్వరరాజు ఇలా ప్రవర్తిస్తున్నాడని అనిపిస్తోందని, ఆయన ఎవరి దగ్గరో చేసిన అప్పులను తమపై రుద్దాలని చూస్తున్నట్లుందని జీవిత పేర్కొన్నారు.
కొంతకాలంగా మీడియా ఎక్కువగా తమను టార్గెట్ చేస్తోందని జీవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరిగినా కూడా జీవిత రాజశేఖర్ల విషయాల మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారని, పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెడుతుంటారని వాపోయింది. మా కూతుళ్ల విషయంలోనూ అలాగే చూశారు. ఆ థంబ్ నెయిల్స్ చూసి ఎంతో మంది ఫోన్లు చేశారు.. వారు తిరుమలకు వెళ్తుంటే.. అలాంటి సమయంలోనే అలా రాశారు.. వాళ్ల పాటికి ఏదో వాళ్లకు వచ్చిన అవకాశాలతో సినిమాలు చేసుకుంటూ ఉన్నారు.. అలా తప్పుడు థంబ్ నెయిల్స్ ఎందుకు పెడతారు అంటూ జీవిత రాజశేఖర్ ఎమోషనల్ అయింది.
ఇక రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమాకు దర్వకత్వం వహించింది జీవిత. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన జోసెఫ్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…