Jeevitha : గరుడ వేగ సినిమా కోసం రూ. 26 కోట్లు ఎగ్గొట్టారని, దీనికి సంబంధించిన కేసులో జీవితకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారని వచ్చిన నేపథ్యంలో జీవిత స్పందించింది. ఈ కేసు ఏడాది నుంచి నగరి కోర్టులో నడుస్తోంది. ఇంతకు ముందు కూడా నాపై వారెంట్ జారీ అయ్యింది. తాజాగా సమన్లు వచ్చిన మాట వాస్తవమే కానీ నేను అరెస్ట్ కాలేదు. ఈ కేసులో నేను గెలిచాను. వాళ్లు చేస్తున్న ఆరోపణలలో ఎంత మాత్రం వాస్తవం లేదు, అవన్నీ తప్పుడు ఆరోపణలు.. అని పేర్కొంది.
మేము ఎలాంటి తప్పు చేయలేదు. కోర్టు తీర్పు తర్వాత అన్ని వివరాలు చెబుతాం. మాపై ఆరోపణలు చేసిన వారు చాలా తప్పులు చేశారు, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి.. అని జీవిత ప్రెస్మీట్లో భాగంగా వెల్లడించింది. నేను దాక్కో లేదని, తిరుగుతూనే ఉన్నానని అన్నారు. కోటేశ్వర రాజు మీద అనేక ఆరోపణలు ఉన్నాయని, తామంటే నచ్చని వారెవరో వెనక ఉండి ఇలాంటి పనులు చేస్తుంటారని జీవిత చెప్పారు. ఓవర్ యాంబిషన్ కారణంగా కోటేశ్వరరాజు ఇలా ప్రవర్తిస్తున్నాడని అనిపిస్తోందని, ఆయన ఎవరి దగ్గరో చేసిన అప్పులను తమపై రుద్దాలని చూస్తున్నట్లుందని జీవిత పేర్కొన్నారు.
కొంతకాలంగా మీడియా ఎక్కువగా తమను టార్గెట్ చేస్తోందని జీవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరిగినా కూడా జీవిత రాజశేఖర్ల విషయాల మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారని, పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెడుతుంటారని వాపోయింది. మా కూతుళ్ల విషయంలోనూ అలాగే చూశారు. ఆ థంబ్ నెయిల్స్ చూసి ఎంతో మంది ఫోన్లు చేశారు.. వారు తిరుమలకు వెళ్తుంటే.. అలాంటి సమయంలోనే అలా రాశారు.. వాళ్ల పాటికి ఏదో వాళ్లకు వచ్చిన అవకాశాలతో సినిమాలు చేసుకుంటూ ఉన్నారు.. అలా తప్పుడు థంబ్ నెయిల్స్ ఎందుకు పెడతారు అంటూ జీవిత రాజశేఖర్ ఎమోషనల్ అయింది.
ఇక రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమాకు దర్వకత్వం వహించింది జీవిత. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన జోసెఫ్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…