Sarkaru Vaari Paata : మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్లిమిటెడ్ల సంయుక్త నిర్మాణంలో తెరకెక్కతున్న చిత్రం.. సర్కారు వారి పాట. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఆయన పక్కన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కళావతి సాంగ్తోపాటు పెన్నీ సాంగ్ కూడా ప్రేక్షకులను అలరించాయి. కళావతి పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతుండడం విశేషం. ఇందులో డ్యాన్స్ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఇక పెన్నీ సాంగ్లో మహేష్ బాబు కుమార్తె సితార డ్యాన్స్ చేయడం విశేషం. కాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ను కొంత సేపటి క్రితమే లాంచ్ చేశారు. సర్కారు వారి పాట.. వెపన్ లేని ఆట.. అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సర్కారు వారి పాట సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆయన స్వర పరిచిన పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకోగా.. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. మే 12వ తేదీన ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు.
అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్పై మహేష్ ఫ్యాన్స్ మండిపడ్డారు. సర్కారు వారి పాట అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతుందని.. ఇంత ఆలస్యంగా అప్డేట్స్ విడుదల చేస్తున్న బ్యాడ్ టీమ్.. అంటూ ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మహేష్ కు చెందిన ఓ పిక్ను వారు రిలీజ్ చేశారు. అందులో ఆయన తాళాల గుత్తి పట్టుకుని రౌడీలను చితక్కొడుతూ ఉండడం విశేషం. ఇక బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…