Jayasudha : తెలుగు సినీ ప్రేక్షకులు నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి సహజనటిగా పేరుగాంచారు. ఈమె ఇండస్ట్రీలో 50 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. ఇలా సుదీర్ఘ కెరీర్ ఉన్న నటి హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎవరూ లేరనే చెప్పాలి. అయితే తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక విషయాలను ఆమె పంచుకున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న జయసుధ తన కెరీర్ కు చెందిన అనేక విషయాలను వెల్లడించారు.
50 ఏళ్లుగా హాలీవుడ్లో కనుక నటించి ఉంటే బొకెలు ఇచ్చి సన్మానాలు చేసేవారని.. కానీ తెలుగులో ఎవరూ పట్టించుకోవడం లేదని జయసుధ అన్నారు. ఇన్ని సినిమాలు తీసినా కనీసం పద్మశ్రీ దక్కలేదని జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జయసుధ తన కెరీర్ను బాలనటిగా ప్రారంభించింది. ఇప్పటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అయితే తమకు అనుకూలంగా మాట్లాడుతుందని చెప్పి కంగనా రనౌత్కు పద్మశ్రీ ఇచ్చారని.. కానీ 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న తనకు కనీసం పద్మశ్రీ దక్కలేదని అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఇప్పటి వరకు తనను ఇండస్ట్రీలో ఉండనిచ్చేవారు కాదని జయసుధ అన్నారు. ముంబై నుంచి వస్తే నెత్తిన పెట్టుకుంటారని, వారి కుక్క పిల్లలకు కూడా రూమ్స్ ఇస్తారని, కానీ ఇక్కడి నటీనటులకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఆ గొడవలు భరించలేక అమెరికా వెళ్లానని.. ఎన్నికలు అయ్యాకే వచ్చానని తెలిపారు. అప్పట్లో శోభన్బాబు డబ్బులు పొదుపు చేసుకోమని, స్థలాలు కొనాలని అనేక సార్లు చెప్పారని, కానీ తాను వినిపించుకోలేదని.. సావిత్రిలా తాను కూడా ఎంతో డబ్బును పోగొట్టుకున్నానని జయసుధ తెలిపారు.
కాగా టాలీవుడ్ ఇండస్ట్రీపై జయసుధ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమాలకు కలెక్షన్లు లేక ఇండస్ట్రీ పెద్దలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమయంలో జయసుధ చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లు అవుతోంది. మరి ఆమె కామెంట్స్పై ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…