Janhvi Kapoor : అతిలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసి తరలిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయితే తల్లికి తగ్గ తనయగా జాన్వీ కపూర్ కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. అందులో భాగంగానే ఈమె ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈమెకు ఒక్క హిట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. కానీ నటిగా ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మంచి హిట్ కోసం ఈమె ఎదురు చూస్తోంది. ఇక టాలీవుడ్కు కూడా ఈమె అదిగో.. ఇదిగో పరిచయం అవుతుంది.. అంటూ ఇప్పటికే అనేక సార్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ వట్టి పుకార్లే అని తేలిపోయింది. అయితే ఈసారి మాత్రం జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీపై సాలిడ్ అప్ డేట్ రానుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత కొరటాల శివ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో జాన్వీకపూర్ను ఎంపిక చేయాలని అనుకుంటున్నారట. గతంలోనూ బోనీకపూర్ ఈ విషయంపై చెప్పారు. ఎన్టీఆర్ తో కలిసి జాన్వీకపూర్ను టాలీవుడ్కు పరిచయం చేయాలని శ్రీదేవి కోరిందట. దీంతో బోనీ కపూర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్తో ఈమె నటించబోతుందని తెలుస్తోంది. గతంలో విజయ్ దేవరకొండ, బన్నీ లాంటి హీరోల సినిమాల్లో జాన్వీ నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుందని బోనీ కపూర్ చెప్పారు. ఇక ఆ సమయం రానే వచ్చింది.
మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా జాన్వీ కపూర్ ను ఎన్టీఆర్తో నటింపజేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. అయితే తనకు కథ నచ్చితేనే సినిమా చేస్తానని ఇప్పటికే జాన్వీ కపూర్ షరతు పెట్టింది. మరి ఆమెను ఒప్పించగలిగే కథను కొరటాల చెబుతారా.. ఆమె తన తల్లి కోరక మేరకు ఎన్టీఆర్ పక్కన నటించి తెలుగు తెరకు పరిచయం అవుతుందా.. అన్న వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…