Janhvi Kapoor : అతిలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసి తరలిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయితే తల్లికి తగ్గ తనయగా జాన్వీ కపూర్ కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. అందులో భాగంగానే ఈమె ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈమెకు ఒక్క హిట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. కానీ నటిగా ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మంచి హిట్ కోసం ఈమె ఎదురు చూస్తోంది. ఇక టాలీవుడ్కు కూడా ఈమె అదిగో.. ఇదిగో పరిచయం అవుతుంది.. అంటూ ఇప్పటికే అనేక సార్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ వట్టి పుకార్లే అని తేలిపోయింది. అయితే ఈసారి మాత్రం జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీపై సాలిడ్ అప్ డేట్ రానుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత కొరటాల శివ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో జాన్వీకపూర్ను ఎంపిక చేయాలని అనుకుంటున్నారట. గతంలోనూ బోనీకపూర్ ఈ విషయంపై చెప్పారు. ఎన్టీఆర్ తో కలిసి జాన్వీకపూర్ను టాలీవుడ్కు పరిచయం చేయాలని శ్రీదేవి కోరిందట. దీంతో బోనీ కపూర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్తో ఈమె నటించబోతుందని తెలుస్తోంది. గతంలో విజయ్ దేవరకొండ, బన్నీ లాంటి హీరోల సినిమాల్లో జాన్వీ నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుందని బోనీ కపూర్ చెప్పారు. ఇక ఆ సమయం రానే వచ్చింది.
మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా జాన్వీ కపూర్ ను ఎన్టీఆర్తో నటింపజేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. అయితే తనకు కథ నచ్చితేనే సినిమా చేస్తానని ఇప్పటికే జాన్వీ కపూర్ షరతు పెట్టింది. మరి ఆమెను ఒప్పించగలిగే కథను కొరటాల చెబుతారా.. ఆమె తన తల్లి కోరక మేరకు ఎన్టీఆర్ పక్కన నటించి తెలుగు తెరకు పరిచయం అవుతుందా.. అన్న వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…