Anjali : అనేక సినిమాల్లో హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి అంజలి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ను ప్రారంభించింది. తరువాత కోలీవుడ్కు పరిచయం అయింది. ఆ తరువాత ఫొటో అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. అనంతరం షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. తదితర చిత్రాలతో పాపులర్ అయింది. అయితే ప్రస్తుతం అంజలికి పెద్దగా అవకాశాలు లేవు. అయితే ఈమె బాలకృష్ణ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అఖండ తరువాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీని చేస్తున్న విషయం విదితమే. ఎన్బీకే 107 వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు కొనసాగిస్తున్నారు. అయితే ఈ మూవీ అనంతరం బాలకృష్ణ అనిల్ రావిపూడితో ఓ మూవీని చేయనున్నారు. అందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో అలరించనున్నట్లు తెలుస్తోంది. అందులో బాలకృష్ణకు కూతురిగా శ్రీలీల నటించనుంది.
అనిల్ రావిపూడితో తీయబోయే సినిమాను ఎన్బీకే 108 వర్కింగ్ టైటిల్తో పూర్తి చేయనున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇందులో బాలయ్యకు భార్యగా ప్రియమణి నటించనున్నట్లు సమాచారం. ఇక ఇదే మూవీలో అంజలి కూడా నటిస్తుందట. కానీ ఈమె అందులో నెగెటివ్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యను నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్లో అంజలి నటిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటనను విడుదల చేయనున్నట్లు సమాచారం.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…