Kangana Ranaut : బాలీవుడ్ బ్యూటీ క్వీన్గా పేరు గాంచిన కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాల కన్నా తన పోస్టులు, కామెంట్లతోనే వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంటుంది. ఈమధ్యే ధాకడ్ అనే సినిమాతో ఈమె ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ మూవీ అత్యంత డిజాస్టర్గా మిగిలింది. రూ.100 కోట్లు పెట్టి సినిమాను తీస్తే.. వచ్చింది రూ.3 కోట్లే. దీంతో ఈ మూవీ వల్ల బాలీవుడ్కు పెద్ద అవమానమే జరిగిందని ప్రముఖులు అంటున్నారు. ఈ మూవీ 3వ రోజు థియేటర్లలో అసలు ప్రదర్శితం కాలేదు. వేరే సినిమాలను ప్రదర్శించారు. ఇక ఓటీటీలో అయినా రిలీజ్ చేద్దామని చూస్తే.. ఎవరూ ఈ మూవీని కొనేందుకు ఆసక్తిని చూపించలేదు. దీంతో కంగనా రనౌత్ కెరీర్లోనే అత్యంత దారుణమైన పరాభవాన్ని ధాకడ్ మూవీ మూటగట్టుకుందని చెప్పవచ్చు. అయితే ఈ మూవీనే కాదు.. దీనికి ముందు తీసిన సినిమాలు కూడా పెద్దగా ఏమీ ఆడలేదు. దీంతో కంగనా భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అంటున్నారు.
కంగనా రనౌత్ తెల్లారి లేస్తే బాలీవుడ్పై దుమ్మెత్తిపోస్తుంటుంది. అప్పట్లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య విషయంలో కంగనా స్పందిస్తూ.. బాలీవుడ్లో ఉన్న బంధుప్రీతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అలాంటి కామెంట్లను ఈమె అడపా దడపా చేస్తూనే వస్తోంది. కానీ సరైన చాన్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ధాకడ్ వల్ల ఆ చాన్స్ రానే వచ్చింది. దీంతో కంగనాను ఇప్పుడు వారు ఆడుకుంటున్నారు. గతంలో ఈమె వల్ల తిట్లు పడిన వారందరూ ఈమెను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చీవాట్లు పెడుతున్నారు. ఈమె నటిస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని.. ఇక ఈమెకు భవిష్యత్తు లేదని అంటున్నారు.
అయితే మొన్నీ మధ్యే ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా.. తాను హోస్ట్ చేస్తున్న లాకప్ షో మాత్రం హిట్ అయిందని.. త్వరలోనే మళ్లీ బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పింది. అయితే నిజంగానే ఆమె చెప్పినట్లు తరువాత ఆమె చేయనున్న సినిమాతో హిట్ కొడుతుందా.. లేదా.. అన్నది చూడాలి. ఒక వేళ ఆమె నెక్ట్స్ సినిమా కూడా హిట్ కాకపోతే.. అప్పుడు బాలీవుడ్లో ఆమె కెరీర్ క్లోజ్ అయినట్లుగానే భావించాలి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…