Kangana Ranaut : బాలీవుడ్ బ్యూటీ క్వీన్గా పేరు గాంచిన కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాల కన్నా తన పోస్టులు, కామెంట్లతోనే వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంటుంది. ఈమధ్యే ధాకడ్ అనే సినిమాతో ఈమె ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ మూవీ అత్యంత డిజాస్టర్గా మిగిలింది. రూ.100 కోట్లు పెట్టి సినిమాను తీస్తే.. వచ్చింది రూ.3 కోట్లే. దీంతో ఈ మూవీ వల్ల బాలీవుడ్కు పెద్ద అవమానమే జరిగిందని ప్రముఖులు అంటున్నారు. ఈ మూవీ 3వ రోజు థియేటర్లలో అసలు ప్రదర్శితం కాలేదు. వేరే సినిమాలను ప్రదర్శించారు. ఇక ఓటీటీలో అయినా రిలీజ్ చేద్దామని చూస్తే.. ఎవరూ ఈ మూవీని కొనేందుకు ఆసక్తిని చూపించలేదు. దీంతో కంగనా రనౌత్ కెరీర్లోనే అత్యంత దారుణమైన పరాభవాన్ని ధాకడ్ మూవీ మూటగట్టుకుందని చెప్పవచ్చు. అయితే ఈ మూవీనే కాదు.. దీనికి ముందు తీసిన సినిమాలు కూడా పెద్దగా ఏమీ ఆడలేదు. దీంతో కంగనా భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అంటున్నారు.
కంగనా రనౌత్ తెల్లారి లేస్తే బాలీవుడ్పై దుమ్మెత్తిపోస్తుంటుంది. అప్పట్లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య విషయంలో కంగనా స్పందిస్తూ.. బాలీవుడ్లో ఉన్న బంధుప్రీతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అలాంటి కామెంట్లను ఈమె అడపా దడపా చేస్తూనే వస్తోంది. కానీ సరైన చాన్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ధాకడ్ వల్ల ఆ చాన్స్ రానే వచ్చింది. దీంతో కంగనాను ఇప్పుడు వారు ఆడుకుంటున్నారు. గతంలో ఈమె వల్ల తిట్లు పడిన వారందరూ ఈమెను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చీవాట్లు పెడుతున్నారు. ఈమె నటిస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని.. ఇక ఈమెకు భవిష్యత్తు లేదని అంటున్నారు.
అయితే మొన్నీ మధ్యే ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా.. తాను హోస్ట్ చేస్తున్న లాకప్ షో మాత్రం హిట్ అయిందని.. త్వరలోనే మళ్లీ బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పింది. అయితే నిజంగానే ఆమె చెప్పినట్లు తరువాత ఆమె చేయనున్న సినిమాతో హిట్ కొడుతుందా.. లేదా.. అన్నది చూడాలి. ఒక వేళ ఆమె నెక్ట్స్ సినిమా కూడా హిట్ కాకపోతే.. అప్పుడు బాలీవుడ్లో ఆమె కెరీర్ క్లోజ్ అయినట్లుగానే భావించాలి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…