Pawan Kalyan : పవన్ కల్యాణ్ అనేక రోజుల పాటు రాజకీయాల్లో ఉంటూ ఆ తరువాత చేసిన సినిమా భీమ్లా నాయక్. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావల్సి ఉన్నా.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ మూవీ విడుదలై ఘన విజయం సాధించింది. మళయాళ రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగినట్లు ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక పవన్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెర మీదకు వచ్చింది. అదేమిటంటే..
మళయాళంలో ఇటీవలే రిలీజ్ అయిన జనగణమన అనే మూవీ జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తోంది. ఇందులో రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం యువతను ఎలా రెచ్చగొడతారు.. సమాజాన్ని ఎలా తప్పుదోవ పట్టిస్తారు.. అనే విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో మళయాళ నటుడు పృథ్వీరాజ్ నటించగా.. మమతా మోహన్ దాస్ ఇంకో కీలక పాత్రలో నటించింది. అయితే ఈ మూవీ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో దాదాపు అన్ని భాషల్లోనూ ఈ మూవీని స్ట్రీమ్ చేస్తున్నారు. అయితే ఇదే మూవీని పవన్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.
జనగణమన సినిమాలో పృథ్వీరాజ్ లాయర్గా నటించారు. కనుక పవన్ కూడా లాయర్గా చేస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సమాజంలో రాజకీయ పరిస్థితులు అలాగే ఉన్నాయని.. అసలు సమస్యల గురించి ప్రజలు ఆలోచించకుండా ఉండేందుకు నేతలు తప్పుదారి పట్టించేలా ప్రయత్నిస్తున్నారని.. కనుక పవన్ ఈ మూవీని చేస్తే అలాంటి వారికి చెంప పెట్టులా ఉంటుందని అంటున్నారు. అయితే పవన్ విశ్లేషకుల మాటలను పరిగణనలోకి తీసుకుంటారా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…